వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం జాతికి అంకితం.!

Publish Date:Jul 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం  అయిన పోలవరం ప్రాజెక్టు  వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.  ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడమే   ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన సోమవారం(జులై 13)   పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్మాణ పనులను  ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయికి చేరుకుని స్పిల్‌వే, రేడియల్ గేట్లు, కాఫర్ డ్యామ్ పనుల పురోగతిని  పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నూతన కార్యాచరణ, గడువుపై విస్పష్ట ప్రకటన చేశారు. 

aస్పిల్‌వే నిర్మాణంతో పాటు రేడియల్ గేట్లు, ఎగువ,  దిగువ కాఫర్ డ్యామ్ పనులను పూర్తి చేశామని చెప్పారు. గోదావరి నదికి వచ్చే దాదాపు 50 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహాన్ని   తట్టుకునే విధంగా   గేట్లను డిజైన్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

అయితే..  ఐదేళ్ల  వైసీపీ హయాంలో..  పోలవరం ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాము 2019 నాటికి కష్టపడి 72 శాతం మేర పూర్తి చేసిన ప్రాజెక్టు పనులను.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్..  రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పక్కన పెట్టేసిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ  వద్దని వారించినప్పటికీ, మొండిగా టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టును ఆలస్యం చేశారని మండిపడ్డారు.

రూ. 440 కోట్లతో నిర్మించిన అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ వరదలకు దెబ్బతిన్నప్పటికీ కనీసం పట్టించుకోలేదని, ఫలితంగా ఇప్పుడు నూతనంగా దానిని నిర్మించాల్సిన భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడిందన్నారు. భూసేకరణ,  నిర్వాసితుల పునరావాస ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..  పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

ప్రాజెక్టు పరిధిలో ఇప్పటివరకు దాదాపు 94వేల152 ఎకరాల భూమిని సేకరించినట్లువివరించిన ఆయన  మిగిలిన భూసేకరణ పనులను ఈ ఏడాది అక్టోబర్ నాటికి  పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు.  పునరావాస కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే సుమారు 17 వేల 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, మిగిలిన నిర్వాసిత కుటుంబాల తరలింపు, పునరావాస కాలనీల నిర్మాణాన్ని కూడా మార్చి 2027 నాటికి   ముగిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల కోసం ఇప్పటివరకు 17 వేల 118 గృహాల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. 

Polavaram,  dedicated to nation,   March next year, cbn, Polivaram Project, Works

By
en-us Political News

  
నరసరావుపేట వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక క్రెడిట్ అవుట్ రీచ్ బహిరంగ సభలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలోని దాదాపు లక్షా 3వేల మందికి పైగా లబ్థిదారులకు 3 వేల 216 కోట్ల భారీ రుణాలను చంద్రబాబు, నిర్మలా సీతారామన్ పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల సమీకరణాలు, ప్రాంతీయ భావోద్వేగాల చుట్టూనే తిరుగుతుంటాయి.
రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఆడే అవకాశం ఇసుమంతైనా లేదు. వయసు రీత్యానే కాకుండా ఫామ్ విషయంలో కూడా రోహిత్ ను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఇసుమంతైనా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లండన్ వేదికగా రోహిత్ శర్మకు ఒక ప్రత్యేకమైన, ప్రతిష్టాత్మకమైన వీడ్కోలు ఇచ్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
ఇటీవల సీనియర్ కాపు నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా కిర్లంపూడిలో చోటుచేసుకున్న పరిణామాలు కేవలం ఒక కుటుంబంలో జరిగిన విషాదం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, . యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య మొదలైన కొత్త ఘర్షణ పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్.. తన స్వార్థపూరిత వ్యూహాల వల్ల ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక నిండా మునిగిపోతోంది.
కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత ఘోరమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది.
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
వైఎస్సా ర్సీపీ నేత నాగార్జున యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ వరుస హత్యల కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది
భారీ రుణమేళా ద్వారా పల్నాడు జిల్లా వ్యాప్తంగా లక్షా మూడు వేల 246 మంది లబ్ధిదారులకు 3 వేల 216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే జిల్లా పరిధిలో ఇంత భారీ స్థాయిలో బ్యాంకింగ్ రంగాన్ని భాగస్వామ్యం చేస్తూ ఆర్థిక సాయం అందించడం ఒక రికార్డుగా నిలిచింది.
భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది.
ప్రస్తుతానికి కోవిడ్ బారిన పడిన వారిలో ముగ్గురు రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరే కాకుండా, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.