దేశ ప్రజలకు ప్రధాని మోడీ థ్యాంక్స్.. ఎందుకంటే?

Publish Date:Jun 29, 2026

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు  ధ్యాంక్స్ చెప్పారు. ఆదివారం (జూన్ 28) ఆకాశవాణి ద్వారా ప్రజలతో మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన దేశ ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.  అంతర్జాతీయంగా ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంలో  ఇండియన్స్ ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి రుజువైందన్నారు.  ఇంతకీ విషయమేంటంటే.. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు,  యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ    దేశ ప్రయోజనాల కోసం బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇంధనాన్ని కూడా పెద్ద ఎత్తున పొదుపు చేయాలని కొన్ని రోజుల కిందట పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తన పిలుపు మేరకు దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేశారు. అలాగే ఇంధన పొదుపు కూడా పాటించారు. దీనినే తన మన్ కీబాత్ లో ప్రస్తావిస్తూ.. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.  ప్రస్తుతం సీషెల్స్ అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి నుంచే దేశ ప్రజలను ఉద్దేశించి తన 135వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో  ప్రసంగించారు. 

అంతర్జాతీయ సంక్షోభ సమయంలో  దేశ ప్రజలు కనబరిచిన ఈ అసాధారణ క్రమశిక్షణ, సామూహిక సహకారం  ఐక్యతకు, అంతర్గత శక్తికి నిదర్శనమన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు కొత్తగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి దూరంగా ఉన్నాయనీ, అలాగే  ఇంట్లో జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కూడా కొత్త బంగారం కొనకుండా, పాత బంగారు ఆభరణాలనే వినియోగించారనీ ప్రధాని చెప్పారు.  అలాగే.. దేశంలో ఇంధన వాడకాన్ని తగ్గించడానికి కూడా ప్రజలు ప్రయత్నించారని మోడీ వివరించారు. 

అనేక మంది తమ విదేశీ పర్యటనలను  వాయిదా వేసుకున్నారని, కార్‌పూలింగ్ పద్ధతులను పాటించారని,  మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను విస్తృతంగా ఆశ్రయించడం ద్వారా దేశంలో భారీగా ఇంధనాన్ని ఆదా చేశారని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సామూహిక కృషి అంతర్జాతీయ వేదికపై భారతదేశ స్థానాన్ని, ప్రతిష్టను ఇనుమడింప చేస్తుందన్నారు.  

ఇంకా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ  అహ్మదాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ యోగా ఆసనాల ఛాంపియన్‌షిప్‌లో  ఇండియన్స్  కనబరిచిన అద్భుత ప్రతిభను  అభినందించారు. ఈ ప్రపంచ స్థాయి పోటీలలో భారత్ ఏకంగా 102 స్వర్ణ పతకాలతో  దూసుకుపోవడమే కాకుండా, మొత్తం 114 పతకాలను సొంతం చేసుకుని అంతర్జాతీయ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ప్రధాని   

By
en-us Political News

  
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన   ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా   ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై  కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.