Publish Date:Apr 21, 2022
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. జాతీయ స్థాయిలో ఈ పేరు కాంగ్రెస్ లో నూతనోత్సాహాన్ని నింపుతుంటే...తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం గుండె బేజారౌతోంది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పటిష్టత కోసం రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైకంమాడ్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఊపిరాడనీయడం లేదు.
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా విభేదాలున్నప్పటికీ ఎవరికి వారుగానైనా కష్టపడి పని చేస్తున్న తరుణంలో పీకే కాంగ్రెస్ గూటికి చేరడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఎందుకంటే....తెలంగాణ రాష్ట్ర సమితికీ పీకేనే అవ్వయిజర్. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ లో చేరితే, ఇక్కడి కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏమిటి? ఎందుకంటే...గత కొంత కాలంగా జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలంటే...ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తలనుసిఫారసు చేస్తున్నారు. అంతే కాక జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలన్నీ విభేదాలు విస్మరించి ఒకే గొడుగు కిందకు రావాలని కాళ్లకు బలపం పట్టుకు మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీకే కాంగ్రెస్ లో చేరిక తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఒక వేళ పీకే ప్రతిపాదనలు, సిఫారసులను అంగీకరించి కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్రంలో తెరాసతో జట్టు కట్టేందుకు అంగీకరిస్తే పరిస్థితి ఏమిటన్నదే రాష్ట్ర కాంగ్రెస్ నేతల టెన్షన్ కు, కంగారుకు కారణం. ఇంత కాలం ఉప్పు, నిప్పూగా ఉంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వచ్చే ఎన్నికల నాటికి జట్టు కడితే...అది ప్రజలకు పంపే సంకేతాలు పార్టీ ప్రతిష్టకు, ప్రయోజనాలకు భంగకరంగా ఉంటాయన్నది వారి భయం. అంతకు మించి భయానికి కారణమేమిటంటే... గెలుపు గుర్రాలకే టికెట్ల పేరుతో పీకే తన టీమ్ తో చేయించే రహస్య సర్వేల ఫలితం ఉద్దేశ పూర్వకంగా తమకు వ్యతిరేకంగా ఉండేలా పీకే మానిప్యులేట్ చేస్తారన్నదే. అందుకు కారణాలు లేకపోలేదు. పీకే కేసీఆర్ కు రాజకీయ సలహాలు ఇస్తున్నారనగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా పీకేపై విమర్శలు గుప్పించారు. పొలిటికల్ బ్రోకర్ గా ఎద్దేవా చేశారు. వంద మంది పీకేలొచ్చినా రాష్ట్రంలో తెరాస మరోసారి అధికారంలోనికి రావడం అసంభవమంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర తెలంగాణ నేతలు తమ భవిష్యత్ ఎలా ఉంటుందన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.
పీకే కాంగ్రెస్ ప్రవేశం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారుతుందన్న ఆందోళనా వారిలో వ్యక్తమౌతున్నది. ఇప్పటికే టీఆర్ఎస్ పీకే సలహాలూ, సూచనలూ తీసుకుంటుండటమే కాకుండా, పీకే బృందంలో రాష్ట్రంలో పరిస్థితులపై సర్వే కూడా చేయించింది. మరో సారి కాంగ్రెస్ తరఫున అదే బృందంలో పీకే సర్వే చేయడమంటే....అది టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేదిగా ఉంటుందనీ, ప్రాంతీయ పార్టీలతో చెలిమి అన్నఫార్ములాకు కాంగ్రెస్ అంగీకరిస్తే... ఆ చెలిమిలో భాగంగా కాంగ్రెస్ సీట్ల విషయంలో భారీగా కోత పడటం తథ్యమని ఇక్కడి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ కు ఒకిన్ని ఎక్కువ స్థానాలు ఇస్తే చాలని హైకమాండ్ అంగీకరిస్తుందేమో అన్న అనుమానం కూడా పార్టీ సీనియర్ నేతలన వేధిస్తున్నది. సప్పోజ్ ఫర్ సప్పోజ్ అదే జరిగితే తమ రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది ఇక్కడి నేతల భయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk-fear-to-telangana-congres-39-134727.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.