పినిపే పేదవాడే, అబ్బాయి మాత్రం చాలా రిచ్
Publish Date:Sep 17, 2012
Advertisement
మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి తప్పతాగి కారు తోలుతూ పోలీసులకు చిక్కాడు. మంత్రిగారబ్బాయి తోలుతున్న కారుని చూస్తే ఆయనగారి జోరెంతో స్పష్టంగా తెలుస్తోందని అంతా ముక్కున వేలేసుకున్నారు. మంత్రిగారబ్బాయ్ కదా... ఆ మాత్రం దర్పం ఉండాల్లే అని కొంతమంది అనుకున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి పినేపే విశ్వరూప్ చూపించిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు కోటీ 13 లక్షల 80 వేల రూపాయలు. అఫిడవిట్ చెబుతున్న లెక్కల ప్రకారం అబ్బాయిగారి పేరుమీద ఓ ఎల్లైసీ పాలసీతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సెక్రటరియేట్ బ్రాంచ్ లో ఓ వెహికల్ లోన్ కూడా ఉంది. అంతా బాగానే ఉంది కానీ.. మంత్రిగారబ్బాయ్ పేరుమీద ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవని అఫిడవిట్ లో చూపించారు. సార్.. ఆస్తుల మొత్తం విలువ దగ్గర దగ్గరగా కోటి రూపాయలు మాత్రమే ఉంది. కానీ.. మంత్రి గారబ్బాయ్ మాత్రం లేటెస్ట్ బ్రాండ్ మోడల్ వోల్వో కారులో తిరుగుతున్నారు. ఇంత తక్కువ ఆస్తులున్న మంత్రిగారు, అబ్బాయికి 35 లక్షల విలువచేసే కాస్ట్లీ కారుని కొనిచ్చారా, లేక వెహికల్ లోన్ కింద చూపిస్తున్న డబ్బుతోనే అంత ఖరీదైన కారుని కొన్నారా.. లేక.. చూపించిన ఆస్తులు మాత్రమే కాక లోపల్లోపల ఇంకా చాలా ఆస్తులూ గట్రా ఉన్నాయా..? అని చాలామందికి అనుమానం కలుగుతోంది. ఒక వేళ లోన్ తీసుకుని అంత ఖరీదైన కారుని కొనుక్కున్నట్టైతే ఇంత తక్కువ ఆస్తులతో, అస్సలు సంపాదనే లేని, ఆస్తి పాస్తుల్లేని అబ్బాయిగారు (అఫిడవిట్ లో చూపించిన దాని ప్రకారం) ఆ లోన్ ఎలా తీర్చగలరో ఏమో అన్న సందేహం కూడా సామాన్యులకు కలుగుతోంది. ప్రజా సంక్షేమంకోసం అహరహం పాటుపడుతున్న మంత్రిగారి భుజాలమీద.. ప్రజలకు ఈ విషయంలో కలుగుతున్న కొత్త కొత్త అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యతకూడా ఉందని నలుగురూ గట్టిగానే అనుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/pinipe-viswaroop-24-17439.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





