Publish Date:Jun 16, 2022
కేంద్రం నుంచి తగినంత మద్దతు వుంటేనే రాష్ట్రంలో అభివృద్ధికి వీలవుతుంది. కేంద్రం లక్షల కోట్లలో నిధులు అందిస్తున్నప్పటికీ అభివృద్ధి శూన్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బిజెపి వర్గీయులు, కేంద్ర మంత్రులు ధ్వజమెత్తడం వింటూనే వున్నాం. కేంద్రం అందిస్తున్న ఆర్ధికసాయం దేనికి ఎలా ఖర్చు పెడుతున్నదీ ఎవరికీ సరయిన వివరాలు తెలియడం లేదని కేంద్రం దుమ్మెత్తిపోస్తోంది. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఇరుక్కుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే అన్నారు. అనంతపురం లో జరిగిన బిజెపి సమావేశం లో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పాలన అంతంత మాత్రంగానే వుందని, మూడేళ్ల తర్వాత కూడా అప్పులు, అవినీ తిలో కూరుకుపోయిందని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వం అప్పుల వూబిలో పీకల్లోతు కూరుకుపోయిందని ఆమె అన్నారు.
దీనికి తోడు, రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో తాత్సారం చేయడం ఎవరూ వూహించనిది. వాస్తవానికి నాలుగవ ఆర్ధిక సంఘం కాలపరిమితి ముగిసి రెండేళ్లయినా ఐదవ ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం దారుణం. దీన్ని సవాల్ చేస్తూ టిడిపి అధికార ప్రతినిధి, న్యాయవాది జి.వెంకట రెడ్డి పిల్ వేశారు. ఆర్ధికసంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల స్థానికి సంస్థలకు నిదుల పంపిణీ సక్ర మంగా జరగడంలేదని, ఆయా సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పిల్లో పేర్కొన్నారు. చట్టనిబంధనల మేరకు ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. నాలుగవ ఆర్థిక సంఘం కాలపరిమితి 2020తో ముగిసింది. రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఐదవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు అందడం లేదు. ఈ కారణంగా స్థానిక సంస్థలు సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నాయి.
స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, నిధులు కేటాయించాలని గవర్నర్కు రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుంది. ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికను గవర్నర్ శాసనసభ ముందు ఉంచాలి. ఆర్థిక సం ఘాన్ని ఏర్పాటు చేయ కపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ఐదవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించమని ఆ పిల్ కోరింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pil--filed-demanding-finance-commission-25-137757.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.