ఫార్మాసిటీ కథ కంచికి... లాభ‌ప‌డిందెవ‌రు?రేవంత్ యూట‌ర్న్ వెనుక ఆంధ్ర రియ‌ల్ ఎస్టేట్‌

Publish Date:Feb 5, 2024

Advertisement

ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్‌షిప్‌లతో కొత్త సిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటివరకు సేక‌రించిన‌ 12,300 ఎకరాల భూముల్లో మెగా టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్ట‌నున్నారు. మ‌రో ప‌క్క  ఫార్మాసిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్టుకు అనుసంధానం ఉండేలా ఓఆర్‌ఆర్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్య ఇవి రూపుదిద్దుకుంటాయి. ఒక్కో ఫార్మా విలేజ్‌ రెండు వేల నుంచి మూడు వేల ఎకరాల్లో ఉంటుంది.
వంద శాతం కాలుష్యరహితంగా ఉండే పరిశ్రమలతో పాటు వాటిలో పనిచేసేవారి నివాస సముదాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వినోద(ఎంటర్‌టైన్‌మెంట్‌) విభాగాలు సహా అన్నీ ఫార్మా విలేజ్‌లో ఉంటాయి. 
ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీని ఎందుకు ర‌ద్దు చేయం. స‌రి చేస్తున్నార‌ట‌. అందులో భాగంగానే 10 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సి.ఎం. నిర్ణ‌యం వెనుక మ‌త‌ల‌బు ఏమిటి?
ఫార్మా సిటీ మాటున పెద్దల భూదందా, ఇన్‌సైడ్ ట్రేడింగ్ జ‌రిగింద‌ట‌. తక్కువకు కొని అధిక ధరకు ప్ర‌భుత్వానికే అమ్ముకున్నార‌ట‌. 
2017లో హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. 
రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్‌ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. 
ఇందులో సుమారు 9,400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. 
మిగిలిన పట్టా, అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం పలు మార్గాల్లో పరిహారం ఇచ్చింది. 
పట్టా భూములు ఇచ్చిన వారికి ఎకరాకు రూ.18 లక్షలతో పాటు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటు (ఒక గుంట), ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. 
కోర్టును ఆశ్రయించిన కొందరు రైతులకు ఎకరాకు గరిష్ఠంగా రూ.26 లక్షలు వచ్చాయి. 
అసైన్డ్‌ భూములు కోల్పోయినవారికి ఎకరాకు రూ.7.50-8.00 లక్షలు ప్రభుత్వం చెల్లించింది. 
వీరికి ఎకరాకు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటుతోపాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. 
ఈ మేరకు నగదు పరిహారం గతంలోనే చెల్లించింది. 
సేకరించిన భూముల్లోనే 600 ఎకరాల మేర లేఅవుట్‌ను అభివృద్ధి చేసి, భూములు ఇచ్చిన వారికి ప్లాట్లను పంపిణీ కూడా చేశారు.
 ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు.
ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌, అత‌ని కుటుంబ‌స‌భ్యులు 300 ఎక‌రాలు కొనుగోలు చేశార‌ట‌.
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో టీఎస్‌ఐఐసీ విశాలమైన రహదారులు, భూగర్భ డ్రైనేజీ, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనతో అభివృద్ధి పనులు చేశారు. 
కందుకూరు పరిధిలో 180 ఎకరాలు సబ్‌ స్టేషన్‌కు కేటాయించారు. 
30 ఎకరాలకు ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించారు. 
48 ఎకరాలను అమెజాన్‌ డాటా సెంటర్‌కు ఇచ్చారు. ఇందులో రూ.5,809 కోట్లతో డాటా సెంటర్‌ ఏర్పాటవుతున్నది. మిగిలిన భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకుగాను సుమారు 300-350 కంపెనీలు ముందుకొచ్చాయి.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.