పీఎఫ్ నిబంధన..భగ్గుమన్న కార్మికలోకం

Publish Date:Apr 20, 2016

Advertisement

కేంద్రం నిన్న ప్రకటించిన కొత్త పీఎఫ్ నిబంధనల పట్ల దేశవ్యాప్తంగా కార్మిక లోకం భగ్గుమంది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో కార్మికులు నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. భారత ఐటీ రాజధాని బెంగుళూరు నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. నగరంలోని గార్మెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ వేలాదిగా తరలివచ్చి వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసులు దీనిని అడ్డుకోవడంతో పలుచోట్ల కార్మికులు విధ్వంసకాండకు దిగారు. బస్సులు, ఇతర వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. అసలు కార్మికులు ఇంతగా రగిలిపోవడానికి కారణమేంటి..?

 

 గత నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. కాని సవరణ ప్రకారం రిటైర్మెంట్ వయసు వచ్చేదాకా మొత్తం సోమ్మును విత్ డ్రా చేసుకోవడం కుదరదు. ఒకవేళ ఉద్యోగం పోయిన పక్షంలో ఉద్యోగి తన వాటాగా చెల్లించిన మొత్తాన్ని, వడ్డీని మాత్రేమే వెనక్కి పొందగలడు, యాజమాన్యం వాటా మాత్రం రిటైర్మెంట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఉద్యోగానికి రాజీనామా చేసి పీఎఫ్ సోమ్ము తీసుకోవడం ఇంతకు ముందు ఉండేది కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తన వాటా మాత్రమే తీసుకోగలడు.

 

యజమాని వాటా రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి వీలుంది. రిటైర్మెంట్ వయసు 55 సంవత్సరాలైతే దీనిని 58 ఏళ్లకు పెంచారు. పాత నిబంధన ప్రకారం రిటైర్మెంట్‌కు ఏడాది ముందు..అంటే 54 ఏళ్ల వయసులో పీఎఫ్ మొత్తంలో 90 శాతాన్ని మాత్రమే తీసుకునే అవకాశముంది. రిటైర్మెంట్ వయసును 58 ఏళ్లకు పెంచడం వల్ల ఈ అవకాశం 57 ఏళ్లకు మాత్రమే వస్తుంది. నిబంధనలు కఠినతరం కావడంతో కార్మికుల్లో అసంతృప్తి పెల్లుబికింది. వెంటనే నష్టనివారణ చర్యలు ప్రారంభించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాత నిబంధనలే అమల్లో ఉంటాయని చెప్పారు. యాజమాన్య కోటాలోని 3.67 శాతంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం జరిగిన మీడియా సమావేశంలో కొత్త నిబంధనలను ఆగష్టు 1 నుంచి అమల్లోకి తెస్తామన్న ఆయన సాయంత్రం మరోసారి మీడియా ముందుకు వచ్చి నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

 

అసలు ఇంత తతంగాన్ని జరపాల్సిన అవసరం కేంద్రానికి ఏమోచ్చింది. అసలే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి సాహసం ఎందుకు చేయాల్సి వచ్చింది. అందుకు సమాధానం ఒక్కటే దేశ నిర్మాణానికి,  పారిశ్రామికాభివృద్ధికి డబ్బు కావాలి. దానికి బాండ్లు, సెక్యూరిటీలు ఎన్ని ఉన్నా సరిపోవడం లేదు. అందుకే కేంద్రం కన్ను భవిష్యనిధిపై పడింది. రిటైర్ అయ్యే వరకు పీఎఫ్ సోమ్మును తన దగ్గరే అట్టిపెట్టుకుని వాటిని ఇతర పథకాలకు మళ్లించాలని కేంద్రం స్కెచ్. కాని కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయాయన్న వాస్తవాన్ని మోడీ గుర్తిస్తే మంచింది. లేదంటే బెంగుళూరు హీట్ దేశం మొత్తం పాకుతుంది.

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.