సొమ్ము ప్రజలది సోకు సర్కార్’ ది పంజాబ్ ‘పందారం’ పై జనాగ్రహం

Publish Date:May 22, 2022

Advertisement

తెలంగాణ సాధన కోసం సుమారు పుష్కర కాలానికి పైగా సాగిన మలి దశ ఉద్యమంలో 1200 మందికి పైగా తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేశారు. అమరులయ్యారు. మరో వారం పది రోజులలో (జూన్ 2 తేదీ) తెలంగాణ రాష్ట్రం అవతరించి ఎనిమిది (8) సంవత్సరాలు పూర్తవుతాయి. అయినా, రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన ఆ 1200 మంది అమర వీరుల కుటుంబాలలో సగం కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పూర్తిగా అందలేదు. అందులో సగం మందిని తెలంగాణ ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. మరి కొందరి చిరునామాలే లేవని ఫైల్స్ క్లోజ్ చేసింది. అందుకే అమర వీరుల కుటుంబాలను గుర్తించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలే కాదు అమరుల కుటుంబాలు,సైతం ఆరోపిస్తున్నాయి. 

అంతే కాదు, ఈరోజుకు కుడా  నిధులు, నీళ్ళు, నియామకాల కోసం ఉద్యమించిన యువత కలలు నెరవేరలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు, రైతులు ఆత్మహత్యలు ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగానే సాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు చనిపోయారు. అనధికారిక లెక్కల ప్రకారం 40 వేల మంది చనిపోయారు. ఆ కుటుంబాలకు ఇవ్వవలసిన పరిహారం ఇవ్వ‌లేద‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకసారి కాదు, అనేక సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు.పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే, నిరుద్యోగ యువకులు ఇక తమకు ఉద్యోగ యోగం లేదనే నిరాశకుగురై, ముఖ్యమంత్రికి లేఖలు రాసి మరీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు.  

అయితే, జాతీయ రాజకీయాల్లో స్థానం కోసం తహతహ లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన ఆరు వందల మంది పంజాబ్ రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షల చొప్పున దాదాపుగా రూ. పద్దెనిమిది కోట్లను నష్టపరిహారంగా అందించేందుకు పంజాబ్’ కు పయనమయ్యారు. మంచిదే, పొరుగు వారికి సహాయం చేస్తామంటే, వద్దనే వారుండరు. అయితే, తెలంగాణ అమరవీరులకు, అదే విధంగా తెలంగాణలో బలవన్మరణాలకు పాల్పడిన  రైతులు, నిరుద్యోగ యువకులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం, పంజాబ్ రైతులకు పరిహారం చెల్లించడం ఏమిటని, ప్రశ్నిస్తున్నారు.ఇది అమ్మకు అన్నం పెట్టని వాడు, పిన్నమ్మకు వడ్డాణం చేయిస్తానని, అన్నట్లుగా ఉందని అంటున్నారు. 
అదే సమయంలో రాజకీయ వర్గాల్లోనూ ముఖ్యమత్రి కేసీఆర్ ‘దాతృత్వం’ పై చర్చ జరుగుతోంది. విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓ వంక తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తుంటే, వారిని పట్టించుకోకుండా… ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్’లో చనిపోయిన రైతులను  ఆదుకుంటామని బయలుదేరారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని సామాన్య  ప్రజలు కూడా గుర్తించారు. 

ఓ వంక కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల లెక్కలు తీస్తున్న తెరాస ప్రభుత్వం,  తెలంగాణ రైతుల వద్ద నుంచి  బాయిల్డ్ రైస్ కొనేందుకు నిరాకరించి, కేంద్రంతో కయ్యానికి కాలు దువ్విన ముఖ్యమంత్రి, పంజాబ్ రైతులకు తెలంగాణ ప్రజలు చెల్లించిన పన్ను పైసలు ఎలా పందారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.  దేశంలో 28 రాష్ట్రాలున్నాయి, అయినా మరే రాష్ట్రం కూడా పంజాబ్ రైతులను ఆదుకుంటామని ముందుకు రాలేదు. నిజానికి ఆ అవసరం కూడా లేదు. అందుకే, మరో రాష్ట్ర ప్రభుత్వమే కాదు , పంజాబ్ ప్రభుత్వం కూడా ఢిల్లీ ఆందోళనలో చని పోయిన రైతులకు పరిహారం చెల్లించలేదు. చివరకు పంజాబ్’లో అధికారంలో ఉన్న ఆప్’ ఢిల్లీలోనూ అధికారంలో ఉంది,

అయినా పంజాబ్ రైతులకు పైసా సాయం చేయలేదు. అలాంటప్పుడు  తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధమన్న వాదన వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ వంద కోట్లకు చేరిన తెరాస నిధుల నుంచి పంజాబ్ రైతులకు అడుకోవచ్చని, కానీ,   తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో రాజకీయం చేస్తున్నారని.. అక్కడ మైలేజీ కోసం ప్రజా ధనం వాడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్ష పార్టీలు అదే విమర్శలు చేస్తున్నాయి. రైతు కుటుంబాలను ఆదుకోవడాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ.. ముందుగా సొంత రాష్ట్ర రైతుల్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. అది ఎవరి సొమ్ము.. ఎవరు, ఎందుకోసం దానం చేస్తున్నారు? అనే ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాదానం చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.