వరంగల్ డిక్లరేషన్ తో కాంగి ‘రేసు’

Publish Date:May 21, 2022

Advertisement

వరంగల్ డిక్లరేషన్ తో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. టీఆర్ఎస్, బీజేపీలపై ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నది. కాంగ్రెస్ కు సహజ రుగ్మతలుగా చెప్పుకునే అంతర్గత విభేదాలను దాటి జనంలోకి దూకుడుగా వెళ్లేలా వరంగల్ డిక్లరేషన్ తో స్కెచ్ వేసుకుంది. టీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠత్మకంగా ప్రారంభించిన థరణి పోర్టల్ కుప్పుస్వామి మేడ్ డిఫికల్టీలా తయారైందన్న విమర్శలతో రైతులకు చేరువయ్యే వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ధరణి పోర్టల్ వల్ల రైతుల ఇబ్బందులు రెట్టింపయ్యాయన్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కల్పించింది.  ధరణి పోర్టల్ కు ముందు పరిస్థితే మేలని రైతులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ కు ధరణి పోర్టల్ వల్ల నష్టం తప్పేటట్లు లేదని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితినే కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునేలా వ్యూహ రచన చేసి దూసుకుపోతున్నది.  ధరణి వల్ల రైతుల ఇబ్బందులను గమనించిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని హామీ ఇస్తున్నది. అదే సమయంలో రాష్ట్రంలో దూకుడు పెంచిన బీజేపీ ధరణిపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంలో వెనుక బడింది. రాహుల్ గాంధీ వరంగల్ సభలో టీఎస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధరణిపై చేసిన  ప్రకటనకు    రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను తీసేస్తామన్న తమ హామీని మరింతగా ప్రజలలోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతు కష్టాలను అడ్రస్ చేయడంలో కాంగ్రెస్ బీజేపీ కంటే మెరుగ్గా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.

వరంగల్ డిక్లరేషన్ తో రైతులలో విశ్వాసాన్ని పొందామని భావిస్తున్న కాంగ్రెస్ ఆ దిశగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోరు అనివార్యమని భావిస్తున్న నేపథ్యంలో రైతు సమస్యలపై కాంగ్రెస్ సీరియస్ గా పని చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే రచ్చ బండ కార్యక్రమంలో ధరణి పోర్టల్ వల్ల రైతుల ఇబ్బందులపై ప్రముఖంగా ప్రస్తావించాలని నిర్ణయించుకుంది.  వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు కౌలు రైతులకు పంట రుణమాఫీ అమలు హామీలపై రైతులలో కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తమౌతున్నదన్న పరిశీలకుల విశ్లేషణలతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది.

కొనుగోలు కేంద్రాల పేరుతో తెలంగాణ సర్కార్ రైతులను దగా చేసిందనీ, కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో అకాల వర్షాలకు రైతుల తీసుకు వచ్చిన ధాన్యం తడిసి ముద్దై నష్టాలలో కూరుకుపోయారనీ కాంగ్రెస్ విమర్శిస్తున్నది. అన్నిటికీ మించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రం పరస్పర విమర్శలతో విలువైన కాలాన్ని వృధా చేసి రైతులతో అయోమయం నెలకొల్పారని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో రైతులు ధాన్యం కల్లాల వద్ద మరణిస్తుంటే..వారి వైపు కన్నెత్తి చూడని  సీఎం కేసీఆర్   పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేయడానికి వెళ్లడాన్ని ప్రశ్నిస్తోంది.  

సరిగ్గా ఆ అంశంలోనే రాష్ట్రంలో రైతులు కూడా కేసీఆర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలలోనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసి జాతీయ రాజకీయాలంటూ సీఎం చేస్తున్న ప్రసంగాల పట్ల జనంలో పెద్దగా స్పందన రావడంలేదనీ, పైపెచ్చు ఆయన జాతీయ అంశాలు ప్రస్తావించే  ప్రతి సారీ జనం రాష్ట్ర సమస్యలపై ప్రశ్నలు సంధిస్తున్నారనీ పరిశీలకులు ఉదాహరణలతో విశ్లేషణలు చేస్తున్నారు.

సరిగ్గా ఈ అంశాన్నే కాంగ్రెస్ అందిపుచ్చుకుని జాతీయ పార్టీగా తాము ప్రాంతీయ అంశాలపై పోరాడుతున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది.  కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందనీ, కేసీఆర్ రాష్ట్ర సమస్యలను విస్మరించి దేశం పట్టుకు తిరుగుతున్నారన్న విమర్శలతో దూకుడుగా ప్రజలలోకి వెళుతోంది.  కాంగ్రెస్ లో ఈ జోష్.. ప్రజలను ఆ పార్టీకి చేరువ చేస్తుందా.. లేక పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య భేదాభిప్రాయాలతో మర మారు ప్రజల ముందు పలుచన అవుతుందా వేచి చూడాలి.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.