చెత్త పన్నుతో చిక్కులు.. జ‌గ‌న‌న్న‌పై జ‌నం తిరుగుబాటు..

Publish Date:Mar 19, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వలేదు, కావచ్చు.ఖజానా వట్టి పోయి ఉండవచ్చును. అయినా, చెత్త పను కట్టలేదని షాపుల ముందు చెత్త తెచ్చిపోయడం, ఇంటి పన్ను కట్టలేదని ఇళ్ళల్లోకి జొరబడి సామానులు ఎత్తుకు పోవడం, సర్కార్ చేయవలసిం పనులేనా? కాదు,ముమ్మాటికీ,కాదు.పన్నులు కట్టకపోతే, కట్టించుకునేందుకు ఒక పద్దతి ఉంటుంది. అంతేకానీ, నడి వీధిలో చెత్తపోసి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, అవమానించడం, ఇంటి పన్ను చెల్లించలేదని ఇళ్ళలోకి వెళ్లి సామానులు తీసుకు వెళ్ళడం, వడ్డీ వ్యాపారులు చేసినా డి నేరం వుతుంది. అలాంటిది ప్రభుత్వం, అదే పనిచేస్తే నేరం రెండితలు అవుతుంది. అయినా, ఏపీ ప్రభుత్వం అదే చేస్తోంది. కాకినాడ, కర్నూలు సహా అనేక నగరాలు పట్టణాలలో పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లలో తిరుగుతూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఒక విధంగా, జగన్ సర్కార్ పన్ను వసూలుకు అనుసరిస్తున్న పద్దతి, కాల్ మనీ కథలను గుర్తుకు తెస్తోందని సామాన్యులు అంటున్నారు. ప్రభుత్వానికి,వడ్డీ వ్యాపారులకు తేడా లేకుండా పోయిందని, ఇది మనవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అంటున్నారు. 

అయితే ఇది స్థానికంగా అధికారులు తీసుకున నిర్ణయం కాదు. రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం. ముఖ్యమంత్రి అదేశాల మేరకు తీసుకున్న నిర్ణయమని అధికారాలు చెపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపధ్యంలో, ఈ లోగా, అంటే, మార్చి 31 లోగా ప్రజల నుంచి, చెత్త పన్ను, ఆస్తి పన్నుల పద్దులకింద  రూ.1,033.94 కోట్లు వసూలుచేసి ఖజనాకు జమచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది. ఆ ఆదేశాలు మెడ మీద కత్తిలా వెల్లడుతున్నాయి. అందుకే అధికారులు అన్ని ఉపాయాలూ ప్రదర్శిస్తున్నారు. సచివాలయాల ఉద్యోగులు, వార్డు వాలంటీర్ల సేవలనూ వినియోగిస్తున్నారు.

అయిత జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చెత్త పన్నువిషయంలో, అదే విధంగా పెంచిన ఆస్తి పన్నుపై ప్రజల్లో, ప్రజాసంఘాల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పటివరకూ ఆచితూచి వ్యవహరించిన పుర, నగరపాలక సంస్థలు కొద్దిరోజులుగా వీటి వసూళ్ల కోసం ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నాయి. చెత్త పన్ను చెల్లించని దుకాణాల ముందు చెత్త వేసి, ఆస్తిపన్నుపై స్పందించని ప్రజల ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. కాగా, జగన్ ప్రభుత్వం పన్ను వసులకు అనుసరిస్తున్నపద్దతులను ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చెత్త పన్న వేయడమే చెత్త ఆలోచన, ఆపైన పన్ను వసూలుకు అనుసరిస్తున్న పద్దతులు మరింత అవమానకరంగా ఉన్నాయని,ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. 

కాగా, తాజాగా నగరపాలక సంస్థల పరిధిలో పన్నుల వసూలుకు సంబంధించిన ఘటనలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్’ స్పందించారు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లలో తిరగడం ఏం సూచిస్తోందని ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు. డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే వాళ్ల మాదిరిగా ప్రభుత్వ ఆలోచన విధానం ఉందని పవన్ మండిపడ్డారు. చెత్త సేకరణకు పన్ను విధించడమే దరిద్రం అనుకుంటే...దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దరిద్రంగా ఉందన్నారు.కర్నూలులో వ్యాపారులు చెత్తపన్ను చెల్లించలేదని చెత్తను పోసి అవమానిస్తారా అని ప్రశ్నించారు పవన్‌. ఇది కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ప్రభుత్వానికి నచ్చడం లేదన్నారు.

ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొదలు ప్రతి ఒక్కరు చెత్త పన్ను, జుట్టు (జిజియా) పన్నును గుర్తుతెస్తోందని అంటున్నారు. అలాగే, అధికారుల మెడల మీద కత్తిపెట్టి ప్రభుత్వం ప్రస్తుతానికి, ఖజానా నింపుకోవచ్చని, అయితే,అందుకు భార్ర మూల్యం చెల్లించక తప్పదని, హెచ్చరిస్తునారు.
 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.