ప్రియాంకకు పార్టీ పగ్గాలు.. కాంగ్రెస్ లో కానరాని ఆసక్తి

Publish Date:Aug 25, 2022

Advertisement

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కుంటే, పోయినదేదో దొరికే  అవకాశం అంతో ఇంతో ఉంటుంది. అంతే కానీ, ఎక్కడో పారేసుకుని ఇంకెక్కడో వెతుక్కుంటే ఫలితం ఉండదు సరి కదా, ప్రయాస మిగులుతుంది. ఇప్పుడు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అచ్చం అలాగే, వుంది. నిజమే, కాంగ్రెస్ పార్టీకి గాంధీ నెహ్రూకుటుంబం ఒక అసెట్., అలాగే ఒక లయబిలిటీ కూడా. అందుకే, కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనత రెండూ నెహ్రూ గాంధీ కుటుంబమే, అనే నానుడి ఒకటి బలంగా నాటుకు పోయింది. 

కానీ, అదంతా గతం, ఇప్పుడు పరిస్థితి అది కాదు. నడుస్తున్న చరిత్రలో జరుగుతన్న పరిణామాలను గమనిస్తే, నెహ్రూ గాంధీ కుటుంబం బలం కంటే, బలహీనతే బలంగా కనిపిస్తోంది. ఎవరు అవునన్నా, ఎవరు  కాదన్నా, సోనియా గాంధీ చాలా వరకు కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకు పోయారు. పార్టీ మీద పట్టును నిలుపుకున్నారు. పడిలేచిన కెరటంలాగా, పదేళ్ళ విరామం తర్వాత అయినా, 2014లో కాంగ్రెస్ సారధ్యంలో సంకీర్ణ (యూపీఏ) ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమికను పోషించారు. అలాగే, తిరిగి 2009 మరో మారు కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, 2014లో సోనియా, రాహుల్ గాంధీ సారధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఓడి పోయింది. అధికారం కోల్పోయింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లోక్ సభలో పార్టీ బలం రెండంకెల (52) స్థాయికి పడిపోయింది. తిరిగి 2019లో తొలిసారిగా, రాహుల్ గాంధీ సారధ్యంలో అదే స్థాయిలో ఓడిపోయింది.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్ళు పూర్తవుతున్నాయి. ఈ నేపధ్యంలో మళ్ళీ మరోమారు కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం అందుకోగలదా? అంటే, అనుమానం లేకుండా అయ్యే పనికాదనే సమాధానమే వస్తోంది. నిజమే, ప్రస్తుతం తిరుగులేదన్నట్లు వెలిగి పోతున్న బీజేపీ వెలుగులు రేపటి 2024 ఎన్నికల్లోనూ, కాదంటే ఆ తర్వాత ఐదేళ్లకు వచ్చే, 2029 ఎన్నికల్లో కనుమరుగైతే కావచ్చును.కానీ, ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుందా? చేయగలదా ? అంటే, నెహ్రూ గాంధీ కుటుంబ సారధ్యంలో అది అయ్యే పని కాదనే   సమాధానమే వస్తోంది. 

ఃనెహ్రూ నుంచి సోనియా గాంధీ వరకు, కాంగ్రెస్ పార్టీకి  ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఉపద్రవాలు ఎదురైనా నెహ్రూ గాంధీ కుటుంబం పార్టీని కాపాడుతూ వచ్చింది. ముఖ్యంగా ఇందిరా గాంధీ, ఒకటికి రెండు సార్లు నిట్టనిలువునా చీలినా పార్టీ మీద పట్టును నిలుపుకుంటూ వచ్చాను. చీలిక వర్గాలు కాలగతిలో కలిసిపోయాయి. ఇందిరాగాంధీ తర్వాత, రాజీవ్ గాంధీ, సోనియ గాంధీ  ప్రత్యక్షంగా కాకుంటే  పరోక్షంగానే అయినా  పార్టీ మీద పట్టును నిలుపు కుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు, సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కాంగ్రెస్ తిరిగి కోలుకోవడం అయ్యే పని కాదని, అందరూ అంగీకరిస్తున్నారు.

ఓ వంక వరస ఓటములు పార్టీని వెంటాడుతుంటే, మరో వంక తరతరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు పార్టీ వదిలి పోతున్నారు. అలాగే, ఇంతకు  ముందు ఎప్పుడు లేని స్థాయిలో పార్టీలో అసమ్మతి రగులుతోంది. ఏకంగా 23 మంది పార్టీ సీనియర్ నేతలు, జీ 23 పేరిట ఒక అసమ్మతి వేదికను ఏర్పాటు చేశారు. అందులో సభ్యులుగా ఉన్నగులాం నబీ ఆజాద్,ఆనంద్’శర్మవంటి వంటి సీనియర్ నాయకులు పార్టీ పదవులు ఇస్తామన్నా వద్దంటున్నారు. సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితులు పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్ లో  కోలుకోవడం, మళ్ళీ మరో మారు అధికారంలో భాగస్వామి కావడం కాని పనిగానే పరిశీలకులు భావిస్తున్నారు.  

అదొకటి అలా ఉంటే రాహుల గాంధీ కాదంటే, ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రతిపాదన విషయంలోనూ పార్టీలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదని అంటున్నారు. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లుగా, ప్రియాంక పేరు తెర మీదకు వచ్చినా ఫలితమ ఉండదని అంటున్నారు. అందుకే, రాహుల్ గాంధీ చెప్పినట్లుగా పార్టీ అధ్యక్ష పదవిని గాంధీ నెహ్రూ కుటుంబం బయటి వారికి ఇవ్వడమే ఉత్తమమని, పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.