కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరాకు సుప్రీంకోర్టులో షాక్

Publish Date:Apr 15, 2026

Advertisement

 

 

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్‌ ఖేరాకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అస్సాంలోని గువాహటిలో నమోదైన కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు గతంలో మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ వివాదం నేపథ్యం పరిశీలిస్తే.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్‌ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో గువాహటిలో పవన్‌ ఖేరాపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, వారం రోజుల పాటు తాత్కాలిక ముందస్తు బెయిలును మంజూరు చేస్తూ హైకోర్టు గత శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ సమయంలోగా అస్సాంలోని సంబంధిత కోర్టును సంప్రదించాలని సూచించింది.

అయితే, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ ఊరటను అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కేసు అస్సాంలో నమోదైతే, తెలంగాణ హైకోర్టులో బెయిల్ అడగడం చట్టబద్ధం కాదని వాదించారు. ఈ పిటిషన్‌ను విచారించే ప్రాదేశిక అధికార పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, స్థానిక అస్సాం న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా నేరుగా ఇక్కడకు ఎందుకు వచ్చారో ఖేరా తరఫు న్యాయవాదులు సరైన వివరణ ఇవ్వలేకపోయారని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను తప్పుబడుతూ స్టే ఇచ్చింది.

ఒకవేళ పవన్‌ ఖేరా నేరుగా అస్సాం పరిధిలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉంటే, తాము ఆయన విన్నపాన్ని సానుకూలంగా పరిగణనలోకి తీసుకునేవాళ్లమని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టపరమైన ప్రక్రియను సరైన మార్గంలో అనుసరించాలని సూచించింది.

ప్రస్తుత పరిణామాలతో పవన్‌ ఖేరా ఇప్పుడు తప్పనిసరిగా అస్సాం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగానూ ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార బీజేపీ కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పాలక పక్షం స్పష్టం చేస్తోంది. మున్ముందు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

By
en-us Political News

  
ఆ చోక్ పాయింట్లే ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మార్గాల్లో తలెత్తే అతిచిన్న లోపం లేదా యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసే ప్రమాదం పొంచి ఉంది.
ప్రపంచం ఎంత పెద్దదైనా, దాన్ని నిలిపివేయడానికి కొన్ని కిలోమీటర్ల సన్నని సముద్ర మార్గమే చాలనేది నేటి జియోపాలిటిక్స్ చెబుతోంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం కంటే ఎక్కువ భాగం సముద్ర మార్గాల ద్వారా జరుగుతోంది. అందులో కూడా అత్యంత కీలకమైన చమురు, సహజవాయువు, గోధుమలు, ఎలక్ట్రానిక్స్, కంటైనర్లు కొన్ని చోక్ పాయింట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా రిజర్వేషన్ల అమలు ఒక చారిత్రక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఈ వ్యూహాత్మక మార్పులో ఒక కీలక మైలురాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభింస్తుంది. దీనివల్ల మలక్కా జలసంధి గుండా సాగే నౌకాయానాన్ని నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యం అమెరికాకు పెరుగుతుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల కదలికలపై ఆంక్షలు విధించి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా, ఇప్పుడు అదే తరహా ఒత్తిడిని చైనాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పై ఒత్తిడి పెంచిన తర్వాత, ఇప్పుడు అమెరికా దృష్టి మలక్కా జలసంధి వైపు మళ్లింది. ఇది చైనా ఎనర్జీ భద్రతకు అత్యంత కీలకమైన మార్గం. ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న కొత్త రక్షణ ఒప్పందం, ఈ వ్యూహాత్మక మార్పుకు ప్రధాన సూచికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
లోకేష్‌ కన్నా అర్హులెవరు? ఏపీ భావి ముఖ్యమంత్రి ఆయనే.. వర్మ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ ఐటీ సంస్థలైన టీసీఎస్ కోల్ ‌కతా, టెక్ మహీంద్రా గోరేగావ్, హుబ్లీలోని ఇన్ఫోసిస్ కార్యాలయాల్లో పక్షపాత ధోరణులు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రార్థన సమయాల్లో వెసులుబాటు, సెలవుల మంజూరు, మతపరమైన చిహ్నాల ధారణ వంటి విషయాల్లో అసమాన నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు. గుర్గావ్ లోని విప్రో, హైదరాబాద్ లోని ఎల్ అండ్ టీ వంటి సంస్థల ఉద్యోగుల నుంచి కూడా దాదాపు ఇలాంటి పోస్టులే దర్శనమిస్తున్నాయి.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ ఉద్దేశాలపై అనుమానం వ్యక్తం చేసింది. ఓఆర్‌ఆర్‌ ఎక్కడ నిర్మించాలో ఒక రైతు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తూ.. ఇటీవల కాలంలో చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలను రాజకీయ దురుద్దేశాల దాఖలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన ఈ పిటిషన్ కూడా అలాంటిదేనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వీడియోలో పునరుద్ఘాటించారు. తనపై ఇంత పెద్ద అభియోగం రావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలకు పూర్తిగా సహకరిస్తానన్న మంగ్లీ, ఈ ఫైనాన్స్ చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదానికి తనకూ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.
వర్క్ ప్లేస్ సమానత్వం అన్నది ఒక కంపెనీ సమస్య కాదు, దేశ భవిష్యత్తు ఈ ఆరోపణలు నిర్ధారించని వాంగ్మూలాలు అయినప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు.
నవ్వుతూ ఆపరేషన్ థియోటర్ కువెళ్లిన హారిక మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగపోయారు. ఆపరేషన్ వికటించి హారిక మరణించిందని వైద్యులు చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.