Publish Date:Jun 25, 2025
పవన్ కళ్యాణ్కి తమిళ రాజకీయాల్లో తొలి ఎదురు దెబ్బ తగిలిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇలాంటి రాజకీయాలు చేస్తానని ముందుకొచ్చిన రజనీకాంత్ అక్కడ తన పొలిటికల్ ఖాతా తెరవకుండానే ప్యాకప్ చెప్పేశారు. ఆయన నాన్ లోకల్ కూడా కావడంతో.. అప్పట్లో శీమాన్ తదితరులు ఇక్కడ రాజకీయ పార్టీ పెడితే ఒప్పుకునేది లేదంటూ తెగేసి చెప్పారు. ఇప్పుడు పవన్ చూస్తే తమిళనాడు సంప్రదాయానికి విరుద్ధంగా ఆధ్యాత్మిక రాజకీయాల బాట పట్టారు.నిజానికి ఇక్కడ ఎంత ద్రవిడ వాదం ఉన్నా.. భక్తి ఏం తక్కువ ఉండదు. కరుణానిధితో సహా అందరూ ఇక్కడ సెంటిమెంట్లు ఫాలో అయ్యేవాళ్లే. కానీ విచిత్రమైన విషయమేంటంటే.. పైకి అందరూ ద్రవిడ వాదం వల్లె వేసేవారే.
ఆ మాటకొస్తే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ సైతం ద్రవిడవాదే. అలా అయితేనే ఇక్కడ నెగ్గుకు రాగలం.ఈ విషయం తెలీకుండా పవన్ ఇక్కడ తనదైన సనాతన్ మార్క్ పాలిటిక్స్ ప్లే చేస్తానంటూ కుదరదని అంటున్నారు తమిళులు. అందుకే సత్యరాజ్ నుంచి ఫస్ట్ వార్నింగ్ వచ్చింది. ఇది తర్వాతి రోజుల్లో చాలా చాలా ముదరబోతుంది. దానికి తోడు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఇక్కడ బీజేపీ నుంచి ప్రచారం చేసేలా కనిపిస్తోంది. వీటిని ముందే గుర్తించిన తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన హవాకు ముందు నుంచే బ్రేకులు వేస్తున్నారు.ఈ రోజున దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తామంటే కుదరదని సత్యరాజ్ నుంచి ఒక హెచ్చరిక అయితే వచ్చింది. వచ్చే రోజుల్లో ఈ హెచ్చరికల తీవ్రత ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-39-200632.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.