జగన్ అవసరం జనానికి లేదని చాటుతున్న పవన్!

Publish Date:Jan 11, 2025

Advertisement

తిరుపతి తొక్కిసలాట ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరుపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయన పోలీసుల పని తీరుపై చేసిన వ్యాఖ్యలు, అధికారుల సమన్వయలోపాన్ని ఎత్తి చూపిన తీరు పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్ఠించాయి. సామాన్య జనం పవన్ మాటలు సూటిగా, నిర్మొహమాటంగా, నిష్కర్షగా ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తుంటే.. వైసీపీయులు మాత్రం పవన్ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ.. కూటమి పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందనడానికి ఇదే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు పవన్  కల్యాణ్ ఏ సందర్భంలో పోలీసుల వైఫల్యం, అధికారుల సమన్వయ లోపం, టీటీడీ వీఐపీ యాటిట్యూడ్ పై వ్యాఖ్యలు చేశారన్నది గమనిస్తే.. వైసీపీయుల వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ రాజకీయలబ్ధి కోసం పడుతున్న వెంపర్లాటలో భాగమే అని ఇట్టే అవగతమౌతుంది. 

పవన్ కల్యాణ్ తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వారు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే.. ఏపీలో ప్రతిపక్షం లేదు. విపక్షంగా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నప్పటికీ వారెవరూఅసెంబ్లీకి రావడం లేదు. ప్రజలు తిరస్కరించినా సరే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నఅసంబద్ధ డిమాండ్ తో అసెంబ్లీని బాయ్ కాట్ చేసింది. అడపాదడపా సోషల్ మీడియాలో విమర్శలు, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే... ప్రభుత్వంపై నాలుగు రాళ్లేసి ముఖం చాటేయడం వినా ఆ పార్టీకి మరో యాక్టివిటీ కనిపించదు. విజయవాడను బుడమేరు వరద ముంచెత్తినప్పుడు కానీ, ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట విషద సమయంలో కానీ ఆ పార్టీ రాజకీయం చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత బాధితులకు స్వాంతన కలిగేలా వ్యవహరించడానికి ఇవ్వలేదు. శవ రాజకీయాల కోసం మాత్రమే ఆ పార్టీ అధినేత కానీ, నాయకులు కానీ బయటకు వస్తున్నారు. మీడియా ముందు మాట్లాడుతున్నారు. 

ఇక్కడే పవన్ కల్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారుల సమన్వయ లోపం, టీటీడీ వీఐపీ యాటిట్యూడ్ పై వ్యాఖ్యలు చేశారు. అంతే రాష్ట్రంలో ప్రతిపక్షం లేని లోటును పూడ్చేందుకు తాను ఉన్నానని చాటారు. ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి కూడా పొరపాట్లను ఎత్తి చూపారు. సరిదిద్దుకోవాలన్నారు. సరిదిద్దు కుంటామని చెప్పారు. ప్రభుత్వం తరఫున బాధితులకు, వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. ప్రతిపక్షం లేదు అన్న ప్రజలలో కలగకుండా.. ఆ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్న సంకేతాన్ని పవన్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. స్వపక్షంలోనే విపక్షంగా ఉంటామని ఆయన కూటమి ఎన్నికలలో  తిరుగులేని విజయం సాధించిన నాడే చాటారు. ఆయన ప్రకటనను అప్పట్లో చంద్రబాబు కూడా చాటారు. ప్రభుత్వంలో ఉన్నా కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన గళమెత్తుతుందనడానికి గతంలోనే ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. 2014 ఎన్నికలలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసింది. అప్పడు తెలుగుదేశం ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలే అప్పట్లో మంత్రులను అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే చేస్తున్నారు. అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల విషయంలో స్పందిచడానికి స్వపర బేధం ఉండదని చాటారు.  

ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అర్హత లేకున్నా ఆ హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలూ ఈ ఆర్నెళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పనైనా చేశారా? అంటే లేదు.    ప్రభుత్వానికి ఇప్పటి వరకూ నిర్మాణాత్మక సూచన చేసిన ఉదంతం లేదు. ఇదీ ప్రభుత్వ వైఫల్యం అని ఎత్తి చూపిన ఒక్క సందర్భం లేదు. అసలు ఒక రాజకీయ పార్టీగా వైసీపీకి, ఆ పార్టీ నాయకుడిగా జగన్ కు ఒక దిశదశ ఉన్నట్లు కనిపించదు.  ఈ పరిస్థితులతో తామే ప్రతిపక్షంగా ఉంటామని కూటమిలోని పార్టీలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగమే తిరుపతి తొక్కిసలాట వ్యవహారంలో  ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు. విమర్శలు. ఇది స్వాగతించాల్సిన అంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్  ప్రతిపక్ష పాత్ర కూడా తానే పోషిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతున్నారు. మా ప్రభుత్వం తప్పు చేసినా ఎత్తి చూపుతాననీ, సరిదిద్దుకునేలా చేస్తానని అంటున్నారు. ఇందులో తప్పుపట్టాల్సిందేముందని పరిశీలకులు అంటు న్నారు.   అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన గట్టిగా ప్రశ్నించారు.  బాధితులకు భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం చేతకాని తనాన్ని గుర్తించి.. ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నారు.  దీనిని స్వాగతించే సంస్కారం వైసీపీకి లేదు. కనీసం  చూసి నేర్చుకోవడానికైనా ప్రయత్నిస్తే మంచిదని పరిశీలకులు సూచిస్తున్నారు. 

By
en-us Political News

  
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.