సీమలో తెలుగుదేశం కూటమి భేష్.. మరి వైసీపీయో?

Publish Date:Aug 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి, సంక్షేమాలను జోడుద్దులుగా సమానంగా అమలు చేస్తూ ప్రజాదరణ పెంచుకుంటోంది. అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. 

వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.  కేవలం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితం కాకుండా, కాకుండా, అభివృద్ధి కేంద్రీకృత పాలిటిక్స్ తో ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 

రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.  వైసీపీకి పెట్టని కోట లాంటి రాయలసీమలో  ప్రస్తుతం  ప్రగతి వెలుగులు తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా మారుతున్నాయి.  తిరుపతి జిల్లాలో  శ్రీ సిటీని  విస్తరించడం, అనంతపురం జిల్లాలో తయారీ రంగ పరిశ్రమలను  ప్రోత్సహించడం,  కడప మరియు కర్నూలు జిల్లాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా సీమను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తోంది చంద్రబాబు సర్కార్.  ఈ ప్రాంతంలో నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా  స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇది సీమలో తెలుగుదేశం కూటమి పట్ల ప్రజా బాహుల్యంలో సానుకూలతను పెంచుతోంది. అదే సమయంలో..  వైసీపీ ఆదరణ రోజు రోజుకూ తగ్గుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాయలసీమలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి  తిరుగులేని పట్టు ఉండేది.  తెలుగుదేశం పార్టీకి అక్కడక్కడా కొన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉన్నప్పటికీ,  మొత్తంగా  సీమలో వైసీపీదే అధ్యప్యం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. అయితే తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి  అధికారపగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో పట్టు సాధించడమే లక్ష్యంగా పావులు కదిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ తెలుగుదేశం కూటమి రాజకీయాలు కాకుండా అభివృద్ధిని మెయిన్ అజెండాగా తీసుకుని ముందుకు సాగింది.   రాజకీయంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా ముందుకు సాగడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్న పరిస్థితి.  

AP Coalition Government, Rayalaseema Development Strategy,  Chandrababu Naidu Political Strategy, Telugu One  

By
en-us Political News

  
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.