పవన్ బీజేపీ ఆడించే తోలుబొమ్మ : మహేశ్ కుమార్ గౌడ్

Publish Date:Jun 15, 2026

Advertisement

 

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఆవిర్భావాన్ని పదేపదే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని, అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగా సోనియా గాంధీ తెలంగాణను అందించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని అవమానించడం పవన్ కళ్యాణ్‌కు కొత్త కాదని, అదే ధోరణిని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని విమర్శించారు.

బీజేపీ నేతలు చెప్పిన మాటలనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ఆయన బీజేపీ ఆడించే తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది సినిమా కాదని, ఇష్టానుసారంగా డైలాగులు చెప్పడానికి రాజకీయాలు వేదిక కాదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆదరణ వల్లే పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి ఎదిగారని, ఇప్పుడు అదే తెలంగాణను కించపరచడం సరికాదని హితవు పలికారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని, అధికారం ఉందని తెలంగాణ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను అధ్యయనం చేస్తే నెహ్రూ, గాంధీ కుటుంబాల త్యాగాలు తెలుస్తాయని, కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలని అన్నారు. దేశ అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కాంగ్రెస్ చేసిన కృషిని గుర్తించాలని పేర్కొన్నారు.

తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని, రాజకీయ పరిపక్వత ఇంకా అవసరమని అన్నారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనే అనుమానాలు వారి వ్యాఖ్యలతో బలపడుతున్నాయని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగాలని, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించకపోవడం వెనుక కూడా ఏదో రాజకీయ అవగాహన ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.

By
en-us Political News

  
యూకేలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖకు సంబంధించిన వాహన్, సారథి సాఫ్ట్‌వేర్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు
కేంద్రంలో ఏపీకి ప్రాధాన్యత పెంచేలా ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ అంశం తీవ్ర దుమారం రేపుతోంది.
విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసిన చెంగల్పట్టు కోర్టు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీ సంచలనాలు సృష్టిస్తోంది. అమెరికా రెడీమేడ్ డ్రోన్లు ఎందుకు ఫెయిల్ అవుతాయో, ఉక్రెయిన్ 250 కిలోమీటర్ల రేంజ్ ఏఐ డ్రోన్లతో రష్యాను ఎలా దెబ్బతీస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల ఉద్యోగానికి వెళ్లలేనప్పుడు మీ నెలవారీ ఆదాయాన్ని కాపాడే ఆదాయ రక్షణ బీమా (Income Protection Insurance) గురించిన టాప్ 5 అపోహలను మరియు వాటి వెనుక ఉన్న అసలు నిజాలను నిపుణుల సర్వే గణాంకాలతో సహా ఇక్కడ తెలుసుకోండి.
అంతర్జాతీయ శాంతి ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల పంట పండింది. సెన్సెక్స్ 1,100 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,000 మార్కు వైపు దూసుకెళ్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఇ లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై ఐవరీ కోస్ట్ 1-0తో ఘన విజయం సాధించింది. 90వ నిమిషంలో అమాద్ డియాల్లో కొట్టిన సంచలన గోల్ ఈక్వెడార్ 19 మ్యాచ్‌ల అజేయ రికార్డును ముగించింది. మ్యాచ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టి, టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ రికార్డు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాపిల్ సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ (iPhone Fold) విడుదలకు సిద్ధమవుతోంది. ఐఓఎస్ 27 కోడ్‌లో లీకైన క్రేజీ ఫీచర్లు, స్క్రీన్ సైజులు, కెమెరా మరియు లాంచ్ డేట్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ‘ఎ’ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ పవర్ ప్లే లోనే అవుట్ అయ్యారు. తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.