పీవోకేలో పాకిస్థాన్ వ్యతిరేక ఆందోళనలను ఉధృతం.!

Publish Date:Jul 6, 2026

Advertisement

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)  రగిలిపోతోంది. పాకిస్థాన్ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. పాకిస్థాన్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.  జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేతృత్వంలో ఈ నెల 3న మొదలైన ఆందోళన, నిరసన ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి.

 ముజఫరాబాద్, రావలకోట్, మీర్పూర్, దాద్యాల్, దేరకోట్ వంటి ప్రధాన నగరాలు అట్టుడుకుతున్నాయి. తమను బానిసలుగా చూస్తున్న  పాక్ ప్రభుత్వంపై జనం ఒకరకంగా తిరుగుబాటు చేశారు.  అయితే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు..  టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు.  అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు.  మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.  

దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.  ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ  నిషేధం విధించింది. ఆ సంస్థ నాయకులు, శ్రేణుల కోసం పీవోకే వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేట మొదలెట్టింది.  ఇప్పటికే..  ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ లీడర్ షౌకత్ నవాజ్ మీర్‌తో పాటు 600 మందికి పైగా సామాజిక కార్యకర్తలు,   నాయకులను అరెస్ట్ చేసింది.  ఇక పీవోకే సమాచారం, ఆందోళనల వార్తలు బయటకు తెలియకుండా.. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. 

పీఓకేలోని ప్రధాన పట్టణాలకు ఆహారం, పిండి, అత్యవసర మందుల సరఫరా నిలిపేసి..  ఆర్థిక దిగ్బంధాన్ని విధించారని స్థానిక నిరసనకారులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆకలితో అలమటించేలా చేసి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్న పాక్ పాలకుల ఎత్తుగడలను ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. గతంలో కుదిరిన 38 అంశాల లిఖితపూర్వక ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని, అరెస్టయిన తమ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, కాల్పుల్లో మరణించిన మహ్మద్ యాకూబ్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు తెగించి వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు.  

PoK protests against Pakistan, Pakistan occupied Kashmir unrest, PoK internet blackout, Shaukat Nawaz Mir arrest

By
en-us Political News

  
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.