వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు.. ఏది నిజం.. ఏది అబద్దం?

Publish Date:Jul 11, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరో బర్నింగ్ అంశం నడుస్తున్నది. రెండో విడత వారాహీ విజయయాత్ర మొదలు పెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్   వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏలూరులో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ఇప్పటికి 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమనేలా పవన్ వ్యాఖ్యానించారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో ఉండే వాలంటీర్లు ఎవరు ఎవరి మనిషి.. ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు? ఆడపిల్లలు ఎవరైనా ప్రేమిస్తున్నారా? వారిలో వితంతువులు ఉన్నారా అనే విషయాలను సేకరించి.. ఆ సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 

వాలంటీర్లపై ఇంతటి స్థాయి ఆరోపణలు చేసిన పవన్ ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని, దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని చేసిన  వ్యాఖ్యలు ఇటు వాలంటీర్లలో, అటు వైసీపీలో తీవ్ర కలకలం రేపాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించారు. తమపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని   డిమాండ్ చేశారు. పవన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారాన్ని తగిన ఆధారాలను చూపించాలని నోటీసులు పంపింది.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. వాలంటీర్లు, వైసీపీ నేతలు, మహిళా కమిషన్ స్పందన ఎలా ఉన్నా అసలు పవన్ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? వాలంటీర్ వ్యవస్థకు ఉన్న నిబద్దత ఎంత? అన్నదానిపై ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఏపీ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల వద్ద నిజంగానే ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు.. వారేం చేస్తారు.. ఆదాయం ఎంత.. కులం ఏంటి? యువతీ యువకులు ఎంతమంది? వారేం చదువుతున్నారు? ఎక్కడ ఉన్నారు? ఇంట్లో వితంతువులు ఉన్నారా? వారికి ఆదాయం ఉందా? ఎవరిపై ఆధారపడి జీవిస్తున్నారు? ఆస్తులు, అప్పులు, బ్యాంక్ వివరాలు, గర్భవతులు ఎవరు? ఇలా ఒక్కటేమిటీ ప్రతి మనిషికి సంబంధించిన ప్రతి సమాచారం ఒక్క క్లిక్ తో వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది. మరి ఈ ప్రజల వ్యక్తిగత సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారానికి ప్రభుత్వం భద్రత కల్పించిందా? అనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు కావాలని అడిగే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో వాలంటీర్ల వద్ద సమాచారానికి మేము కల్పించిన భద్రత ఇదని ప్రభుత్వం ముందుగా చెప్పాలి.

 ఇక పవన్ కల్యాణ్ వాలంటీర్లు టార్గెట్ గా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలను చూస్తే.. వాలంటీర్లపై ఈ నాలుగేళ్ళలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల నుండి ప్రభుత్వ పథకాల వరకూ వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్నది అక్షరాలా నిజం. ఎందుకంటే దాదాపుగా వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలే. ఈ మాట వైసీపీ నేతలే బహిరంగంగానే చెప్పేశారు. ఆ కారణంగానే పవన్ అంత పెద్ద ఆరోపణ చేయగలిగారు. ఇక పవన్ వ్యాఖ్యల వెనక మరో కారణం వైసీపీని రెచ్చగొట్టడంగా కనిపిస్తుంది. వారాహీ తొలి విడత యాత్రతో జనసేనలో జోష్ కనిపించింది. అయితే, పవన్ చేసిన ఆరోపణలకు మాత్రం వైసీపీ నుండి సమాధానం రాలేదు. పైగా పవన్ వ్యక్తిగత జీవితంపై మాత్రమే వైసీపీ దాడి చేసింది. అందుకే పవన్ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. పవన్ అనుకున్నట్లుగానే వైసీపీ నుండి, ప్రభుత్వం నుండి జెట్ స్పీడ్ లో రెస్పాన్స్ వచ్చింది. పవన్ యాత్రకి ఫుల్ పబ్లిసిటీ కూడా వచ్చేసింది. మరి ఈ అంశం ఎంతవరకు వెళ్తుందో.. ఎవరికి మేలు చేస్తుందో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.