అధికారం చేజిక్కించుకోవడానికి పోటీ పడే రాజకీయ పార్టీలు హఠాత్తుగా దేశ భక్తి లో ఎవరు గొప్ప అనేది తేల్చుకోవడంలో పడ్డాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో వారిదే అసలు సిసలు దేశభక్తి అంటూ ప్రకటించడం పరిపాటిగా మారింది. దేశభక్తి దేశ ప్రజలందరికీ ఉంటుందని బీజేపీ వారు ఒక్కరే దేశభక్తులుగా భావించడం, కాషాయంలో మునిగితేలడం, ప్రజలందరినీ అదే రంగులో ప్రయాణిం చేలా ఉత్తేజితులను చేయడానికి కసరత్తులు చేయడం మాత్రం దేశభక్తి కాదన్నది విపక్షాల మాట.
కాలం మారినా, రాజకీయాలు మారినా, సిద్ధాంతాల పరంగా ఒకరికి ఒకరు పడకపోయినా దేశమంతటా అందరూ గౌరవించేది మహాత్మాగాంధీనే. ఎందుకంటే ఆయన మహాత్ముడు గనుక. కాంగ్రెస్ అంటే బొత్తిగా పడని టీఆర్ ఎస్ కూడా ఇపుడు కాంగ్రెస్ మాయలో పడిందనే అనుమానాలూ వస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ తెలంగాణా రాష్ట్రమంతటా ఎంపిక చేసిన 522 సినిమా థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శనకు టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ సినిమా ఆగష్టు తొమ్మిది నుంచి 22వ తేదీ వరకూ ప్రదర్శిస్తారు. ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 నిమిషాల వరకూ ప్రదర్శిస్తారు.
బెన్ కింగ్స్టే గాంధీగా నటించిన అటన్బొరో చిత్రం ఇది. దేశమంతటా బ్రహ్మాండంగా కాబోయినా చాలా మందిని ఆకట్టుకుంది ఈ చిత్రం. ముఖ్యంగా బెన్ కింగ్స్లే గాంధీ పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. ఆయన కోసమే సినిమాకి జనం వెళ్లారు. అయితే ఈ చిత్రం బ్రిటీషర్లు దేశానికి మహామేలు చేశారన్న ప్రస్థా వన మళ్లీ తెలియ జేయడమే ప్రధానంగా ఈ చిత్రం వ్యక్తం చేసిందనేది చాలామంది విమర్శకుల మాట.
కేంద్రంలో స్వాతంత్య్రదినోత్సవ వజ్రోత్సవాలను నిర్వహించే సమయంలోనే ఇక్కడ తెలంగాణాలోనూ కేసీఆర్ అందుకు పోటీగా నిర్వహించడం తన దేశభక్తిని ప్రదర్శించమే అయింది. బీజేపీ పట్ల తన విము ఖతను మరింత స్పష్టం చేయడానికే కాంగ్రెస్ కు మద్దతుగా మునుగోడు లో అభ్యర్ధిని నిలబెట్టడం లేదు. రాష్ట్ర అవసరాలాను, అభ్యర్ధనలను బొత్తిగా పట్టించుకోని కేంద్రం మాట వినక్కర్లేదన్న ధోరణినే టీఆర్ ఎస్ ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. టీఆర్ ఎస్ నాయకులు, మంత్రులు అవకాశం దొరికిన వేదికల మీద మోదీ ప్రభుత్వం మీద, బీజేపీ పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. దేశ భక్తి అంటే కేవలం బీజెపీ ఓవరాక్షన్తో వ్యవహరించడమేకాదని దేశభక్తి తమకూ ఉందని టీఆర్ ఎస్ ప్రకటించడానికే ఇపుడు రాష్ట్రంలో గాంధీ సినిమా ప్రదర్శనకు పూనుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/patriotism--the-way-blowing-now-39-141587.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.