ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్
Publish Date:Mar 14, 2012
Advertisement
ప్రస్తుతం రాజకీయ నాయకుల నోట తరచుగా మ్యాచ్ ఫిక్సింగ్ అనేమాట ఒకటి వినబడుతుంది. గతంలో ఈ మాట ఎక్కువగా క్రికెట్ క్రీడలో వినిపించేది. అది ఇప్పుడు రాజకీయాలకు బదిలీ అయింది. ఒక పార్టీ మరో పార్టీని విమర్శించాలనుకున్నప్పుడు ఆ పార్టీ మరేదో ఒక పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుందని, ఆ రెండు పార్టీలు కలిసి తమకు ఓడించడానికి ట్రై చేస్తున్నాయని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై తమను రాజకీయంగా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దొందూ దొందే అని, ఈ రెండు పార్టీలు కలిసి టిడిపిని అధికారంలోకి రాకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణా ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బతికి బట్టకట్టకుండా చేయడానికి టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణాలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాయని టిడిపి నేత ఎర్రంనాయుడు తాజాగా ఆరోపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తే తెరాస ఓట్లు చీలిపోతాయని అది తెలుగుదేశం పార్టీకిలభిస్తుందని అందుకే టిడిపి ఓటమికోసం తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని ఇలా ప్రతి పార్టీ మరో రెండు పార్టీలను మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని ఆరోపిస్తుండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
http://www.teluguone.com/news/content/parties-match-fixing-24-12627.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





