Publish Date:Nov 11, 2024
పాడి కౌశిక్ రెడ్డి. ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో మారు మ్రోగిపోతుంది, గతంలో పిఏసీ చైర్మెన్ పదవిఅరికెపూడికి రేవంత్ సర్కారు ఇవ్వడంతో ఒంటి కాలిపై లేచినంత పని చేశాడు. పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ జట్టుకు దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించాడు. అయన తన తొలి మ్యాచ్ ను పంజాబ్ తో తలపడ్డాడు. 2004 డిసెంబరు 22 వతేదీన ఈ మ్యాచ్ ఆడాడు. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గా, మీడియం పేసర్ గా జట్టుకు సేవలందించాడు. ప్రస్తుత రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అని చెప్పొచ్చు. తన స్వంత పార్టీకి చెందిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి కాంగ్రెస్ వైపు చూసినప్పుడు కౌశిక్ రెడ్డి పావుగా కెసీఆర్ గేమ్ ఆడారు. కెసీఆర్ కనుసన్నల మీదే కౌశిక్ రెడ్డి అరికెపూడిపై చెలరేగిపోయారు. బిఆర్ ఎస్ జెండాపై గెలిచి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని బిఆర్ ఎస్ నేతలను గట్టిగా నిలదీసిన ఏకైక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని చెప్పొచ్చు. తన చివరి మ్యాచ్ 2007లో ఆడి, క్రికెట్ నుండి శాశ్వతంగా తప్పుకున్నాడు. ఆయన రాజకీయ గురువు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి రాజకీయ గురువు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి ఓవర్ నైట్ లో బిఆర్ఎస్ లో చేరిపోయారు.హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఈటెల రాజేందర్ పై బిఆర్ ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈటెల వంటి పవర్ పుల్ పొలిటిషియన్ రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకుంటున్న కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోవడంతో చర్చనీయాంశమయ్యారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ దృష్టిలో పడ్డ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో జంప్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. కెసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం లేదని రెచ్చిపోయారు.
పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ నటనలో ఆరితేరిపోతున్నారు. కేసీఆర్ హయాంలో పెండింగ్ లో పెట్టిన దళిత బంధు నిధుల్ని ఇవ్వాలని తాజాగా ఆయన చేసిన రచ్చ చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఆయన కోసం వందల మంది రాలేదు. పట్టుమని పది మంది కూడా లేరు. కానీ పోలీసుల సాయంతో..తన సోషల్ మీడియా టీం క్రియేటివిటీతో ఆయన చేసిన రచ్చ చూసి అందరూ ఔరా అనుకున్నారు. కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా స్టార్ గా మారి పోయారు. ఆయన పండించిన సన్నివేశాల్లో స్పృహ తప్పడం దగ్గర నుంచి ఆస్పత్రిలో చొక్కా విప్పేసి మీడియాతో మాట్లాడటం చివరికి చేతికి కట్టుతో బయటకు రావండి వరకూ చాలా ఉన్నాయి. కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆయన రాజకీయాలు నడుపుతున్నారు. నన్ను హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన రాజకీయ నేత కౌశిక్ రెడ్డి.
తనను గెలిపించకపోతే ఎన్నికల రోజు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్ చేశారు. అప్పట్నుంచి ఆయన కామెడీ స్టార్ గా మిగిలిపోయారు. పీఏసీఎ చైర్మన్ వివాదంలో ఆయన పై దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో తన్నులు తిని హస్య సన్నివేశాన్ని పండించారు. రేవంత్ రెడ్డి వీడియోలు తన వద్ద ఉన్నాయని కౌశిక్ రెడ్డి అంటున్నారే గానీ వాటిని బయటపెట్టకపోవడం బట్టి ఆయన ఉద్దేశ్యం ఏమిటో ప్రజలు ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/padi-kaushik-reddy-over-action--this-former-cricketer-turned-actor-from-politics-25-188182.html
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.