Publish Date:Mar 19, 2025
జన్మత: ఎవరూ నేరస్థులు కారు. వారికి చెడు వ్యసనాలు ఉండనే ఉండవు. మెల్లి మెల్లిగా పక్క దారులు పడుతుంటారు. ఆయా కుటుంబాల ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ వారిని నేరస్థులుగా మార్చేస్తుంది. వారిని నేర ప్రవృత్తిలో దించిన ముఠా గుట్టును తెలంగాణలోని వరంగల్ పోలీసులు రట్టు చేశారు.
అనాథ బాలికలే లక్ష్యం గా ఈ ముఠా గతకొన్నేళ్లుగా పని చేస్తోంది. బాలికలను పడుపు వృత్తిలో ఓ పద్దతి ప్రకారం దించేస్తుంది. అనాథ బాలికలను కొందరు యువకులు ట్రాప్ చేసి ప్రేమపేరిట దగ్గరవుతుంటారు. అబ్బాయిలను పూర్తిగా నమ్మిన బాలికలు వాళ్లు ఏది చెబితే అది వినే పరిస్థితిలోకి వెళ్లిపోతారు. అమ్మాయిల బర్త్ డేలను సాకుగా చేసుకుని విలువైన గిప్ట్ లను ఇచ్చి రొంపిలో దించుతారు. ఈ యువకులు బాలికలకు గంజాయి అలవాటు చేస్తారు. గంజాయి మత్తులో ఉన్న అమ్మాయిలను రేప్ చేస్తారు. రేప్ చేసి వీడియోలు చిత్రీకరిస్తారు. ఈ వీడియోలు చూపిస్తూ తమ కామవాంఛ తీర్చుకోవడమే గాక వ్యభిచారం చేయిస్తారు. ఎదురు తిరిగితే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారు. అమ్మాయిలను మెల్లిగా పడుపు వృత్తిలో దింపి డబ్బులు సంపాదించడం వారి టార్గెట్. కాసులకు కక్కుర్తి పడి అమ్యాయిల జీవితాలను నాశనం చేస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నాయకురాలు ఓ మహిళ కావడం విశేషం. హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన ముస్కులత (38) ఈ ముఠాకు సూత్రధారి. అబ్దుల్, అప్నాన్, షేక్ సైలానీబాబా, మహమ్మద్ అల్తాఫ్, గంజాయి స్మగ్లర్ వదూద్ పాత్రధారులు. వీరిని తన ముఠాలో చేర్చుకుని వ్యభిచార కార్యకలపాలు సాగించింది. అనాథ బాలికలను తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచారం చేయిస్తున్న ఈ ముఠా ను పోలీసులు చాకచర్యంగా పట్టుకున్నారు. కనిపించకుండా పోయిన ఓ బాలిక తల్లిదండ్రులు మీల్స్ కాలనీ పోలీసులకు ఈ నెల 11న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు లత అరసవెల్లిలో పట్టుబడింది. ఆమె చెరలో ఉన్న బాలికలను పోలీసులు విడిపించారు. ముఠా నుంచి ఓ కారు, 75 వేల నగదు, 18 కిలోల గంజాయి, 4,300 కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/orphan-girls-are-forced-into-prostitution-in-the-name-of-love-39-194640.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.