ఒక భేటీ రెండు ప్రయోజనాలు: కేసీఆర్ తాజా వ్యూహం

Publish Date:Apr 18, 2022

Advertisement

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీకి ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిరాడంబరంగా జరుపుకున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ ఏడు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించి అందుకు భారీ ఏర్పట్లనూ మొదలెట్టేసింది తెరాస పార్టీ. 

పనిలో పనిగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానే...జాతీయ స్థాయి నేతగా బీజేపీయేతర పార్టీలను కలుపుకుని పోయేందుకు, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ నేతగా ఆ ప్రయత్నాలను తాను ముమ్మరంగా చేస్తున్నట్లూ కేడర్ కు చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆవిర్భావ దినోత్సవానికి ఒకటి రెండు రోజుల ముందు  వివిధ రాష్ట్రాల నుంచి పలువురు నేతలను ప్రగతి భవన్ కు ఆహ్వానించి వారితో బీజేపీ యేతర కూటమిపై చర్చించేందుకు సిద్ధమౌతున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు డీఎంకే నుంచి కణిమెళి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన నుంచి ఒక అగ్రనేతనూ ఆహ్వానించినట్లు చెబుతున్నారు.  అయితే వీరిలో ఎవరెవరు వస్తారు, ఎవరు రారు  విషయంలో మాత్రం స్పష్టత లేదు.  
ఈ నెల 27న తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుక జరగనుండగా  సరిగ్గా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఒకటి రెండు రోజుల ముందే ఈ భేటీ ఏర్పాటు చేయడం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహమే ఉంది. కేంద్రంలో మోడీని ఢీ కొనగలిగే బలమైన నేతగా తనను తాను పార్టీ కేడర్ ముందు ఫోకస్ చేసుకోవడం, అదే సమయంలో జాతీయ స్థాయిలో పార్టీల మద్దతు తనకు ఉందని విపక్షాలకు తెలియజేయడం ద్వారా రాష్ట్రంలో వాటి దూకుడుకు కళ్లెం వేయడం. ఇలా ఒక్క భేటీతో రెండు ప్రయోజనాలనూ ఏకకాలంలో నెరవేరే విధంగా కేసీఆర్ ప్రగతి భవన్ భేటీకి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు.

అయితే శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ముంబై వేదికగా త్వరలో 13 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరుగనుందనీ, ఈ భేటీలో రానున్న ఎన్నికలలో ఐక్యంగా ముందుకు సాగడం, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, శ్రీరామనవమి, హనుమజ్జయంతి సందర్భంగా  శోభాయాత్రలపై జరిగిన దాడులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇప్పటికే బీజేపీ యేతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారనీ వెల్లడించారు.

త్వరలో ముంబై వేదికగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుండగా  వేరుగా ఆ సదస్సుకు హాజరయ్యే పార్టీల నుంచి నేతలను కేసీఆర్ ఆహ్వానించడంలోని ఆంతర్యమేమిటన్న ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు బీజేపీయేతర కూటమికి తానే ఛాంపియన్ అని చాటుకోవడమే కారణమని విశ్లేషిస్తున్నారు. ముంబై భేటీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేలే షో స్టీల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భేటీకి ఆహ్వానిస్తే మమతా బెనర్జీ లేఖలు రాస్తే...ఈ భేటీకి వేదికగా ముంబై ఎంపికైంది. దీంతో ఆ ఇరువురి ఆధ్వర్యంలోనే భేటీ జరిగిందనే అందరూ భావిస్తారు. దీంతో బేజీపీ యేతర ఫ్రంట్ ను లీడ్ చేసే నేతగా కేసీఆర్ కు గుర్తింపు లభించే అవకాశం ఉండదు. అందుకే ఆ సదస్సుతో సంబంధం లేకుండా బీజేపీ యేతర పార్టీల సీనియర్ నేతలతో కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటీ ఏర్పాటు చేశారంటున్నారు. ఇంతకీ ముంబై భేటీకి కేసీఆర్ కు ఆహ్వానం ఉందా...ఒక వేళ ఉంటే వెళతారా అన్న విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా లేదు.
 

By
en-us Political News

  
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.