Publish Date:Oct 20, 2022
పిల్లల్ని నర్సరీల్లో చేర్చడం ఈరోజుల్లో పరిపాటి. తల్లి ఉద్యోగరీత్యానో, పనుల ఒత్తిడివల్లనో సమయానికి పిల్లల్లి చూసుకోలేని పరిస్థితుల్లోనూ నర్సరీలో చేరుస్తున్నారు. వారికి చిన్నపాటి ఆటపాటలతో సరదాగా అక్కడివారు జాగ్రతగానూ చూసుకుంటుంటారు. అలాగని వదిలేసి ధైర్యంగా తల్లులు ఉండలేరు. ఏదో ఒక భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టు, ఇంట్లోవారు కనిపెట్టుకున్నట్టు అక్కడ కుదరదు గదా. చాలామంది పిల్లల్లో మన పిల్లవాడు! కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు, ఏడుస్తారు, నానా రభసా ఉంటుందక్కడ. నర్సరీ క్లాసులు చూసుకునే టీచర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి పొర పాటు కూడా పిల్లలకు ప్రమాదకరంగా మారవచ్చు. ఇదుగో యార్క్షైర్లో అలాంటి చిన్నప్రమాదమే జరిగింది.
ఏడిది పిల్లాడు జాక్. అతన్ని తన తల్లి దగ్గర్లోని ఒక నర్సరీలో చేర్చింది. వారు నిజానికి బాగానే చూసు కుంటూండేవారు. మొన్ననీ ఒక నర్సు చేసిన తప్పిదంతో పిల్లాడికి దాదాపు కన్నుపోయే ప్రమాదం వచ్చిపడింది. అందరూ ఆస్పత్రికి పరిగెత్తారు. అదృష్టవశాత్తూ కంటికి ఏమీ కాలేదు. ఫస్ట్స్టెప్స్ అనే నర్సరీలో పిల్లలంతా ఆడుతున్నారు. అక్కడ వాళ్ల సంరక్షకురాలు చక్కగా గోళ్ల అందం చూసుకుం టోంది. ఈమధ్య నకిలీ గోళ్లు కూడా వచ్చాయి. వాటిని పెట్టుకుంటోంది. అంతలో ఎటునించి వెళ్లాడో జాక్ ఆమె దగ్గరికి వెళ్లాడు. ఆమె తయారుచేసుకున్న జిగురులాంటి పదార్ధం గిన్నెలో అమాంతం చేయి పెట్టాడు. అది చూసి ఆ నర్సు వాడి చెయ్యి పట్టుకునేలోగానే వాడు లాగేసరికి అది కళ్లకి తగిలి కుడికన్ను వెంటనే ఎర్రగా అయి వాచింది. ఈమె భయంతో ఒణికింది. ఓర్నాయనో ఏదో అయ్యిందిరా అని. ఒక్క పొలికేక పెట్టింది.
వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసికెళితే పరీక్షచేసిన డాక్టర్లు మరేం ఫరవాలేదు కంటికేమీ కాలేదని చెప్పారు. రెండు రోజులు జాగ్రత్తగా చూసుకోమని జాక్ తల్లిదండ్రులకు చెప్పారు. ఆ నర్సరీ స్కూలు యాజమాన్యం ఆ నర్సుని తిట్టి బయటకి పంపేసింది. అంచేత.. పిల్లల్ని నర్సరీకి పంపామని మరీ ధైర్యం గా ఉండకండి.. అక్కడి పరిస్థితులు వాకబు చేస్తుండండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nursery-accidentchild-rescued-from-eye-problem-39-145737.html
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.