Publish Date:Oct 20, 2022
మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయిన వెంటనే చేసిన మొదటి పని ఏమిటంటే, సోనియా గాంధీతో అపాయింట్మెంట్ కోరడం. అంతకు ముందే తన విజయం అమ్మదయే అని ప్రకటించారు. సాధారణంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు అడగ్గానే సోనియా అప్పాయింట్ మెంట్ ఇచ్చేయాలి. మామూలుగానే ఖర్గే వంటి విధేయులకు అడిగినప్పుడల్లా సోనియమ్మ అప్పాయింట్ మెంట్ ఇచ్చేస్తారు.
కానీ ఇప్పుడు తన ఆశీస్సులతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే కోరినా సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. పార్టీ శ్రేణులు ఏమిటిది అంటూ నిబిడాశ్చర్యంలో మునిగిపోయారు. ఆ ఆశ్చర్యం నుంచి వారు తేరుకోకముందే.. వారు దిగ్భ్రమాశ్చర్యాలకు లోనయ్యే మరో సంఘటన జరిగింది. అదేమిటంటే సోనియాగాంధీ స్వయంగా నంబర్ 10, రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసానికి చేరుకున్నారు. సాధారణంగా సోనియాగాంధీ ఎవరి నివాసానికీ వెళ్లరు.. ఎవరైనా సరే ఆమె నివాసానికి వచ్చి కలవాల్సిందే.
ఆ సంప్రదాయం మేరకే అధ్యక్షునిగా ఎన్నికైన వెంటనే ఆయన సోనియా ఆశీస్సులను అందుకోవడానికి అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే సోనియా ఆయనకు అప్పాయింట్ మెంట్ నిరాకరించి.. స్వయంగా ఆమే ఖర్గే నివాసానికి చేరుకుని ఆయనకు అభినందనలు తెలిపారు. పార్టీ మాజీ అధ్యక్షురాలిగా, తాత్కాలిక అధ్యక్షురాలిగా కొత్త అధ్యక్షుడిని స్వయంగా వచ్చి అభినందించడం ద్వారా పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ లో మార్పుపై విస్పష్టమైన సందేశం ఇవ్వాలని సోనియా భావించారు.
పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గేకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి సోనియా స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి.. శ్రేణులకు ఇక ఆయన మార్గదర్శనంలో పని చేయాలన్న స్పష్టమైన సందేశాన్నిచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. అద్యక్షుడెవరైనా రిమోట్ సోనియా చేతిలోనే అన్న భావన ఇకపై ఉండకూడదన్న సందేశాన్ని ఈ చర్య ద్వారా సోనియా ఇచ్చారని అంటున్నారు. సోనియాగాంధీ ఇకపై పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ గా కొనసాగుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా మల్లిఖార్జున్ ఖర్గే స్థానంలో ఎవరిని నియమించాలన్నది సోనియా గాంధీ త్వరలో నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా సోనియా స్వయంగా ఖర్గే నివాసానికి వచ్చి మరీ అభినందనలు తెలియజేయడంపై పార్టీ సీనియర్ నాయకుడు, అధ్యక్ష ఎన్నికలో ఖర్గే ప్రత్యర్థి అయిన శశిథరూర్ స్పందించారు. కాంగ్రెస్ లో స్పష్టమైన మార్పునకు ఇది సంకేతమని అభివర్ణించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-tradition-in-congress-sonia-reaches-kharge-residence-to-greet-him-39-145740.html
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.