బీఆర్ఎస్ లో ఉప్పొంగిన ఎన్టీఆర్ భక్తి!

Publish Date:May 29, 2023

Advertisement

టీఆర్ఎస్ పార్టీ... బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. ఇటువంటి తరుణంలో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు.. భారీ సంఖ్యలో కారు దిగి.. సైకిల్ ఎక్కి.. చెక్కేసేందుకు.. తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసుకొంటున్నారు. ఆ క్రమంలో ఈ విషయాన్ని గులాబీ దళం అధిష్టానం పసిగట్టి.. నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిందని?... అందులోభాగంగా.. ఎన్టీఆర్ జయంతిని వేదికగా చేసుకొని.. పావులు కదిపిందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో  జోరుగా సాగుతోంది.
మే 28వ తేదీ.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి. అయితే ఆయన జయంతి వేడుకలను తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్  మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు.. ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌ నడి బొడ్డును ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన సమాధికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్..  నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయే మహానీయుడు, మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అంటూ కిర్తీంచారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎందరికో ఎన్టీఆర్ భవిష్యత్ ఇచ్చారన్నారు. 

ఇక హన్మకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అలాగే నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఎన్టీఆర్ క్యాంస విగ్రహానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఇక ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్గీయులు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలోనే కాదు.. శివారు ప్రాంతాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూలు కట్టి మరీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

అయితే తాజాగా బీఆర్ఎస్  ప్రజా ప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల.. పోలిటికల్ సర్కిల్‌లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. తెలంగాణలో టీడీపీ మళ్లీ సత్తా చేటేందుకు ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించిన విషయం విదితమే. అందులో భాగంగా అన్ని లోక్‌సభ , అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. అలాగే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరిట కార్యక్రమాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లి..   తమ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు.. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు.. వాటిలోని వ్యత్యాసం.. లోపాలను క్షుణ్ణ్నంగా ప్రజలకు నేరుగా వివరించే ప్రయత్నం చేస్తోంది.  మరోవైపు తెలంగాణ పదాన్ని సెంటిమెంట్‌గా చేసుకొన్న టీఆర్ఎస్ పార్టీ... ప్రస్తుతం ఆ పదాన్ని పక్కన పెట్టి.. బీఆర్ఎస్‌గా  మారిపోయింది. దీంతో తెలంగాణ ప్రజలు సైతం.. సైకిల్ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే  చర్చ సైతం రాజకీయ వర్గాల్లో   సాగుతోంది.
అదీకాక.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ అధినేత నుంచి సాధారణ కార్యకర్త వరకు దాదాపుగా 70 శాతం మంది తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ లోకి వలస వెళ్లి షికారు కొట్టిన వారేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  మరోవైపు.. ముచ్చటగా మూడో సారి కూడా అధికార పీఠం అందుకోవాలనే లక్ష్యంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటూ.. ఇంకోవైపు.. కేసీఆర్‌కి చెక్ పెట్టి పాగా వేయాలని బీజేపీ   తన ఆలోచనలకు మరింత పదును పెడుతూ... ముందుకు సాగుతోంది. ఇక రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం .. దూకుడు మీద ఉంది. అలాంటి తరుణంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి.. అధికారాన్ని అందుకొన్న కేసీఆర్ పార్టీ.. మళ్లీ బీఆర్ఎస్‌గా మారడంతో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ గెలుపు కష్టమనే భావనతోపాటు.. కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ వెళ్లితే తప్ప... పదవి యోగం ప్రాప్తమవదనే  భావనతో ఎన్టీఆర్ అభిమానులను  తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్  తన వంతు ప్రయత్నాలు చేపట్టిందని..  అదీకాక తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు... రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లు పార్టీ గెలుపోటమలను నిర్ణయించడంలో క్రియా శీలకంగా మారనున్నాయి. అటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులు ... ఎన్టీఆర్ రాగం అందుకొన్నారనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.