Publish Date:Mar 12, 2025
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా రెచ్చిపోయి నింబంధనలకు తిలోదకాలిచ్చి దోపిడీ, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన ఒక్కొక్కరిని ఇప్పుడు చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడానికి రంగం సిద్ధమైపోయినట్లే కనిపిస్తోంది. దౌర్జన్యాలు, దోడిపీలు, నిబంధలన ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడి, సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలు, ఆ పార్టీ నాయకులపై ఇష్టారీతిగా పోస్టులు పెట్టిన వారు ఒకరి తరువాత ఒకరుగా కటకటాల పాలౌతున్నారు. బోరుగడ్డతో మొదలెడితే.. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళిలు ఇప్పటికే కటకటాలు లెక్కిస్తుంటే.. రామ్ గోపాల్ వర్మ వంటి వారి కోర్టులను ఆశ్రయించి తాత్కాలిక ఉపశమనం పొందారు. ఇప్పుడిక చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంతు వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత ఏడాది ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో పోలీసులు చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి చెవిరెడ్డిపై ఐదు కేసులు నమోదయ్యాయి. తాజాగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు కోడ్ను ఉల్లంఘించారని చెవిరెడ్డి మీద కేసు నమోదు చేశారు. చెవిరెడ్డికి నోటీసులు బుధవారం (మార్చి 12) నోటీసులు జారీ చేశారు.
గత ఎన్నికలలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో చెవిరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఎర్రగొండ పాలెం పీఎస్ లో మూడు కేసులు, అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ను చెవిరెడ్డి ఉల్లంఘించారని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో మూడు కేసులు, దోర్నాల, పెద్దారివీరుడులో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను చెవిరెడ్డి బెదిరించారన్న కేసు కూడా ఉంది. తమకు అనుకూలంగా పని చేయడం లేదంటూ చెవిరెడ్డి ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖ మీద బెదిరింపులకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.
ఈ ఐదు కేసులకు సంబంధించి తాజాగా ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న వేళ చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇప్పుడిక చెవిరెడ్డి వంతు అన్న భావన వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-it-is-chevireddy-turn-39-194280.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.