స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

Publish Date:Jun 13, 2026

Advertisement

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  స్వచ్ఛ పాఠశాల  కార్యకర్తగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను  స్వచ్ఛ పాఠశాల  పేరుతో శుభ్రం చేసే పనికి శ్రీకారం చుట్టారు. తన పార్లమెంట్ పరిధిలోని ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు   నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలంతా శనివారం (జూన్ 13)తమ తమ పరిధుల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేశారు. సొంతంగా చీపురు తెచ్చుకుని, క్లాత్, మగ్గు, బకెట్ తెచ్చుకుని తరగతి గదులను క్లీన్ చేశారు. 

అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం    సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం (జూన్ 13) స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు.  పైపు నీళ్లతో తరగతి గదిని క్లీన్ చేశారు. ఆ తరువాత శుభ్రంగా తుడిచారు. విద్యార్థులు కూర్చునే టేబుల్ కింద దుమ్ము ధూలి లేకుండా క్లీన్ చేశారు. తరగతి గదిలోని మూలమూలకు వెళ్లి చీపురు పట్టి ఊడ్చారు. నీళ్లతో క్లీన్ చేశారు. తరగతి ఆవరణలోనూ నీళ్లు చల్లారు.  

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..  మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ వర్గాలను కలుస్తున్నాం. అనేక సభలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా  స్వచ్ఛ పాఠశాల పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని పాఠశాలలను పరిశుభ్రం చేయాలని నిర్ణయించాం. రాజకీయాలకు అతీతీంగా మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని కోరాం.  స్పూర్తిదాయకమైన సేవా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. టీచర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొని తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. నిన్ననే ఏ స్కూల్ ను ఎవరెవరు శుభ్రం చేయాలనే విషయంపై    టిఫిన్ బైఠక్’ నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు పాఠశాలలను శుభ్రం చేస్తున్నాం. దీంతోపాటు పాఠశాలల్లో పిల్లలను చేర్చించాలని కోరుతూ ఎల్లుండి గ్రామాలు, మండలాల వారీగా ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నామని చెప్పారు. 

ప్రభుత్వ పాఠశాలలను అభివ్రుద్ధి చేయాలన్నది నా సంకల్పం. అందులో భాగంగానే ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఈసారి కూడా సైకిళ్లు అందించబోతున్నామని బండి సంజయ్ తెలిపారు. టెన్త్ విద్యార్థులందరికీ తన వేతనం నుండి పరీక్ష ఫీజు చెల్లిస్తానన్నారు.  

By
en-us Political News

  
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ను ఎ–11 నిందితుడిగా పేర్కొన్నారు.
రకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై సరిగ్గా జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. కీచకుడిగా మారి.. ఏఐ టూల్స్ సహాయంతో తన వద్దే చదువుకునే ఒక మైనర్ విద్యార్థినిపై మానసిక దాడికి తెగబడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రంప్ చేసిన ఈ అవమానకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసి చర్చలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశారు. దీంతో చర్చలు విఫలమై కథ మళ్లీ మొదటికొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సింధు జలాల వివాదాన్ని రాజకీయం చేస్తూ యుద్ధ నాటకానికి తెరలేపింది. సింధు నదీ జలాల విషయంలో తమ దేశ ప్రయోజనాలకు, నీటి ప్రవాహానికి ఏమాత్రం ముప్పు వాటిల్లుతోందని భావించినా భారత్‌తో యుద్ధానికైనా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. నీటి హక్కులు తమ జాతీయ భద్రతలో ఒక భాగమని, అవసరమైతే సైనిక చర్యకు దిగే అవకాశాన్ని తాము కొట్టిపారేయలేమని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ఈ ప్రమాదంలో కనీసం 60 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లోపల విధులు నిర్వహిస్తున్న మరో 18 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది.
లెబనాన్‌లోని హిజ్బుల్లా వంటి తమ మిత్రపక్ష సాయుధ గ్రూపులను ఇరాన్ వెంటనే నియంత్రించకపోతే, ఆ దేశంపై మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన బాంబు దాడులు, సైనిక చర్యలు తప్పవంటూ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చర్చల హాల్‌లోకి చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రంప్ చేసిన తీవ్రమైన బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆమె అనుభవిస్తున్న బాధను నిరంతరం గమనిస్తున్న దామోదర్ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యాడు. భార్య అనారోగ్యంపై బెంగ పెట్టుకున్న ఆయన, తాము లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే ఆందోళనతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెయింట్లు, ర రసాయనాల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి అనూప్ ప్రధాన్ శరీనం ఛిత్రమై శరీర భాగాలు పది మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి.
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగెస్
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం నాడు ఒక భారీ పారిశ్రామిక దుర్ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.