Publish Date:Apr 16, 2024
నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్- పీజీ) 2024 రిజిస్ట్రేషన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) చేపట్టనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) అధికారిక వెబ్ సైట్ natboard.edu.in లింక్ ను ఓపెన్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
స్టెప్ 1:natboard.edu.in వెబ్ సైట్ ను తెరవాలి.
స్టెప్ 2: వెబ్ సైట్ హోం పేజీలో నీట్ పీజీ 2024 లింక్ పై క్లిక్ చేయాలి
స్టెప్ 3: రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను పూర్తి చేసి అకౌంట్ లోకి లాగిన్ కావాలి.
స్టెప్ 4: ఆ తర్వాత దరఖాస్తు నింపాలి.
స్టెప్ 5: అనంతరం పేమెంట్ పూర్తి చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
స్టెప్ 6: కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకొని ఒక ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి.
ఎవరికి ఎంత పరీక్ష ఫీజు
నీట్ పీజీ 2024 జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ. 3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 2500. పరీక్ష రుసుమును క్రెడిట్ కార్డ్ లేదా దేశీయ బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డు లేదా వెబ్ పేజీలో అందుబాటులో ఉన్న ఇతర చెల్లింపు పద్ధతులను ఉపయోగించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్ సైట్ ను చూడాలి.
ఫలితాలు ఎప్పుడు?
నీట్ పీజీ అడ్మిట్ కార్డు 2024 జూన్ 18న అందుబాటులోకి వస్తుంది. పరీక్షను జూన్ 23న నిర్వహిస్తారు. జూలై 15న ఫలితాలు విడుదల అవుతాయి. గతంలో ఈ పరీక్షను జూలై 7న నిర్వహించాలనుకున్నారు. నీట్ పీజీ 2024కు అర్హత సాధించేందుకు అభ్యర్థులు ఆగస్టు 15 కటాఫ్ తేదీలోగా ఇంటర్న్ షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 15 మధ్య కౌన్సెలింగ్ సెషన్లు జరుగుతాయి. సెప్టెంబర్ 16 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.
ప్రశ్నలు ఇలా..
నీట్ పీజీ పరీక్ష 200 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. పరీక్ష పేపర్ ను కేవలం ఇంగ్లిష్ లోనే ఇస్తారు. అభ్యర్థులు మూడున్నర గంటల్లో పరీక్షను పూర్తి చేయాలి. తప్పు సమాధానాలకు 25 శాతం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జవాబు రాయని ప్రశ్నలకు మార్కుల్లో కోత ఉండదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/neet-pg-2024-registration-from-today-25-173948.html
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా? లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
‘మా ఇద్దరి మనసులు కలిశాయి.. పంచభూతాల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా పెళ్ళి చేసుకున్నాం’ అని సినిమా డైలాగులు చెబితే కుదరదని,
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.
‘అధికారం శాశ్వతం కాదు’... దారిన పోతున్న ఏ దానయ్యని ఆపి ‘అధికారం’ అనే పాయింట్ గురించి అడిగితే ఈ సమాధానమే చెబుతాడు
ఏడువిడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన రెండు విడతల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా వెనుకబడింది. తమ ఎక్స్ పెక్టేషన్స్ కంటే సీట్లు భారీగా తగ్గనున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారు. తోలి విడతలో 102, రెండో విడతలో 88 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతం, రెండో విడతలో 62 శాతం పోలింగ్ నమోదైంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ.. నల్లమల అభయారణ్యంలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయం వెలసి ఉంది.
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది. ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి.
ఓయులో కరెంట్ , నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఓయు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో క్రిషాంక్ ను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది.