దావూద్ ఇబ్రహీంపై కంటే జగన్ పైనే ఎక్కువ క్రిమినల్ కేసులు!

Publish Date:Apr 16, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం తార స్థాయికి చేరింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు  వేగంగా మారుతున్నాయి. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్  పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ఓటు ద్వారా జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు రెడీ అయిపోయారు.  ఇదే విషయాన్ని ప‌లు  స‌ర్వేలు  వెల్ల‌డించాయి. 2 024 ఎన్నిక‌ల్లో తెలుగుదేం కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని, జ‌గ‌న్  పార్టీకి ఘోర పరాజయం తప్పదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌తంలో కోడిక‌త్తి డ్రామా త‌ర‌హా ప్ర‌యోగాల‌కు జ‌గ‌న్ మ‌ళ్లీ తెర‌పైకి తేబోతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.   మూడు రోజుల కిందట జ‌గ‌న్‌పై జరిగిన గులక రాయి దాడి ఘ‌ట‌న ఇందులో భాగ‌మేన‌ని కూట‌మి నేత‌లు ఆరోపిస్తున్నారు.  గ‌త ఎన్నికల ముందు జరిగిన  కోడి క‌త్తి, వివేకానంద రెడ్డి హ‌త్య‌  జగన్ పై సానుభూతి వెల్లువెత్తి ఆయన పార్టీ  భారీ మెజార్టీతో అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. తాజాగా అదే త‌ర‌హా ప్ర‌యోగాల‌తో ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది మ‌రోసారి అధికార పీఠం దక్కించుకునేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతున్నది.  

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్రిమిన‌ల్ మైండ్ తో మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పైకి న‌వ్వుతూ క‌నిపించినా.. ప్ర‌తీ విష‌యాన్ని క్రిమిన‌ల్ మైండ్ తో ఆలోచిస్తారని, ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా గ‌త ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేనని అంటున్నారు. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల అఫిడ‌విడ్ ను చూస్తే ఆయ‌న నేర సామ్రాజ్యం క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌ని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా పులివెందుల ఎమ్మెల్యేగా  ఏప్రిల్ 22న సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన నామినేషన్ వేయడానికి ముందే ఆయన నేరారోపణలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2019 ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ ను రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు త‌న‌ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఎన్నిక‌ల‌ అఫిడవిట్ ప్రకారం సీఎం జ‌గ‌న్‌పై మొత్తం 146   కేసులు ఉన్నాయి.   38 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  వీటిలో 21 కేసులు 2011 సంవత్సరానికి చెందినవి. 13 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి విచారణ లేకుండా అన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే దేశంలోనే డాన్ గా పేరు పొంది విదేశాల‌కు పారిపోయిన దావూద్ ఇబ్ర‌హీం పైనకూడా జ‌గ‌న్ పై ఉన్న‌న్ని క్రిమినల్ లేవని అంటున్నారు.  దావూద్ ఇబ్రహీం విదేశాల‌కు పారిపోకుండా రాజకీయాల్లో చేరిఉంటే, అతను ఖచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడనీ. అధికార అండతో కేసులు విచారణ వరకూ రాకుండా పెండింగ్ లో ఉంచుకోగలిగేవారనీ నాగేశ్వరరావు పోస్టుపై నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు  జగన్ మోహన్ రెడ్డి తనపై నమోదై ఉన్న ఏ కేసూ విచారణకు రాకుండా మేనేజ్ చేస్తున్న విధానం చూస్తే అలాగే అనిపిస్తోందని అంటున్నారు. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం 2011 మంది అభ్యర్థులు పోటీ చేయగా..వారిలో 334 మంది అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపర్చారు. ఇక 222 మంది అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు మొత్తం 96 మంది ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే క్రిమినల్ కేసులున్న 55శాతం మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇక తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో 55 మంది అభ్యర్థులు చట్టసభల్లోకి అడుగు పెట్టగలిగారు. ఓ సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్న 55 మంది ఎమ్మెల్యేల్లో అధికారిక వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. ఇక తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్న వారిలో సీఎం జగన్ ముందు వరుసలో ఉన్నారు. క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రభుత్వాన్ని నడపడం అనే అంశంపై పార్లమెంటులో చర్చ పెట్టాలని గ‌తంలో నేత‌లు డిమాండ్ చేశారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల వేళ గత ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి  సమర్పించిన ఎన్నికల అఫిడవిడ్  సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.   

By
en-us Political News

  
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.