Publish Date:Aug 12, 2022
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో.. తెలుగు రాష్ట్రాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్న మాటలు.. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటికి రెండు సార్లు మీడియాతో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేకుండా ఉన్నాయని జనం అభిప్రాయపడుతున్నారు.
అలాగే వారి మాటల్లోని తేడాను సామాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు ఏకి పడేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈటెలలాంటి ప్రశ్నలు సంధిస్తూ వైసీపీపి ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ సర్కార్ లోని ఇద్దరు మహిళా మంత్రులూ కూడా గోరంట్లకు మద్దతుగా మాట్లాడటంతో నెటిజన్లు ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. అయినా జగన్ సర్కార్, వైసీపీ పార్టీ అంతా నాఇష్టం.. ఏం చేసినా అడిగేదెవరు అన్న రీతిలో వ్యవహరిస్తోంది. అయితే ఇక గోరంట్ల వ్యవహారంలో ఇక ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంలో కేంద్ర పెద్దలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందని హస్తిన నుంచి అందుతున్న సమాచారం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ జస్పీర్ సింగ్ గిల్ ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
ప్రధానికీ, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూ లేఖలు రాశారు. అక్కడితో ఆగకుండా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కారణంగా ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అందరూ అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైన పార్లమెంట్లో ఇటువంటి వ్యక్తులు అడుగు పెట్టడానికి అనర్హులని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని అంటున్నారు. ఈ వీడియో వ్యవహారంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ గిల్ కోరారని అంటున్నారు.
ఎంపీ గిల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పిందించి, న్యూఢ్ వీడియో కాల్ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లేఖ రాసినట్లు తెలిసింది. అలాగే ఈ వ్యవహారంపై స్వతంత్ర్య దర్యాప్తు జరిపి.. సాధ్యమైనంత త్వరగా మహిళా కమిషన్కు నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి రేఖా శర్మ లేఖ రాశారు. దీంతో జగన్ ప్రభుత్వం తమ పార్టీ ఎంపీ అని చూసీ చూడనట్లు ఊరుకుందామనుకున్నా.. ఎదురుదాడితో ఈ వ్యవహారంలో విపక్షాల నోరు నొక్కుద్దామనుకున్నా ఇక వీలయ్యే అవకాశం లేదు. సాంకేతికంగా వీడియో ఒరిజనలా, ఫేకా అని తేల్చడం సాధ్యం కాదంటూ అనంతపురం ఎస్పీతో ప్రభుత్వం చెప్పించినా.. కేంద్రం తలచుకుంటే ఎస్పీ మాటల డొల్ల తనం కూడా వెల్లడైపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం న్యూడ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని నిగ్గు తేల్చాని బావిస్తే వైసీపీ బుకాయింపులకు అవకాశం ఉండదని పరిశీలకులు అంటున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీకి, జగన్ సర్కార్ లో మాధవ్ కు మద్దతుగా మాట్లాడిన వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/national-women-comission-orders-indipendent-probe-into-gorantla-nude-video-issue-25-141798.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.