కేసీఆర్‌ని క‌లిశారు... చిక్కుల పాలయ్యారు!

Publish Date:Aug 27, 2022

Advertisement

కొంద‌రి క‌ల‌యిక అద్భుతం అంటారు, మ‌రికొంద‌రి క‌ల‌యిక ఎంతో మేల‌యిన‌దంటారు, కానీ కేసీఆర్‌తో భేటీ అయిన‌వారంతా రాజ‌కీయాల్లో ఊహించ‌ని షాక్‌లు తింటూండ‌టం గ‌మ‌నార్హం. ఇది యాదృచ్ఛిక‌మా, టీఆర్ ఎస్ అధినేత ఐర‌న్‌లెగ్ మ‌హ‌త్య‌మా అన్నది పక్కన పెడితే...  కేసీఆర్ కు రాజకీయంగా సన్నిహితం అవ్వడానికి ప్రయత్నించిన వారంతా ఏదో విధంగా చిక్కులలో పడుతున్నారన్నది మాత్రం వాస్తవం. 

మోదీ ప్ర‌భు త్వాన్ని గ‌ద్దె దించ‌డానికి కేసీఆర్  తాప‌త్ర‌యం, దూకుడుకు ఒక్క‌సారిగా బ్రేక్ ప‌డడానికి మాత్రం ఆయన వెనుక అడుగు వేయడానికి లేదా ఆయనతో కలిసి నడవడానికి ముందడుగువేసిన వారంతా ఇబ్బందులలో పడుతుండటంతో జాతీయ రాజకీయాలలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు చేసిన చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందాన సాగుతున్నాయి.  

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు కేసిఆర్ బీజేపీ మీద దూకుడుగానే ముందుకు వెళ్ళారు. కేసిఆర్ వెళ్లిన ప్రతి రాష్ట్రం లో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో అదరగొట్టారు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ ప్రచారంతో ఊదరగొట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేక ఫలితాలు వస్తాయని అంచనాతో కేసిఆర్ కేంద్రం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఇక తాను కలిసిన ప్రాంతీయ పార్టీల అధినేతలతో కూడా బీజేపీ పతనం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావించి తనతో కలిసి రావాల్సిందిగా కోరారు. రాజకీయ వ్యూహకర్త పీకే సలహాలతో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ బీజేపీ ఓడుతుందని కేసిఆర్ వేసిన అంచనాలు తప్పాయి.

.సామాజిక న్యాయం, సమానత్వా న్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి తీసుకు వచ్చేందు కు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్  ప్రయత్నాలు  చేశారు. జాతీయ స్థాయిలో పార్టీల నేతలు, పౌర సమాజ సభ్య లు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు ఉమ్మడి వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందని భావించారు కేసీఆర్. ఈ లక్ష్యాలను సాధించే దిశగా అన్ని పార్టీల, వివిధ ప్రజా సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.  పీపుల్స్ ఫ్రంట్ అని సీఎం కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు లో భాగంగా కేసీ ఆర్ ఎన్డీయేతర నాయకులను వరసగా కలిశారు.  మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతోనూ మంతనాలు జరిపారు. కేసీఆర్. అటు మాజీ  ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కూడా  కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి ముచ్చ‌ట‌ప‌డ్డారు.

దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకునేందుకు సరైన సమయంలో గళం విప్పారని, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరా టం కొనసాగించాలని.. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కేసీఆర్‌కు ఉద్ధవ్ థాక్రే మద్దతు ప్రకటించారు. ముంబై వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని ఉద్దవ్ కోరారు. కానీ చిత్ర‌మేమంటే,  కేసీఆర్‌ను క‌లిసి చ‌ర్చించిన వేళావిశేష‌మేమోగాని, ఉద్ధ‌వ్ థాక్రే ఏకంగా సీఎం ప‌ద‌విని కోల్పోయి, అధికార నివా సం నుంచి స్వంత నివాసాన్ని చేరుకున్నారు. ఊహించ‌నివిధంగా బీ\జేపీ పావులు వేగంగా క‌దిపి థాక్రేకు షాక్ ఇచ్చింది. శివ‌సేన పార్టీలోనే అస‌మ్మ‌తి నాయ‌కుల‌ను ప్రోత్స‌హించి థాక్రేకు ఊపిరాడ‌నీయ‌కుండా చేసింది బీజేపీ. త‌న‌కు ప‌ద‌వుల మీద ఎన్న‌డూ ఆస‌క్తి లేద‌ని, ప్ర‌జ‌లు మా పార్టీని న‌మ్ముతున్నార‌ని, వారి అభిప్రాయాన్ని అంగీక‌రిస్తాన‌ని నిండు స‌భ‌లో ప్ర‌క‌టించి మ‌రీ గ‌ద్దె దిగారు.

 అలాగే  జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో కేసీఆర్‌ భేటీల తరువాతే  గనుల లీజు వ్యవహారంలో హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని..  కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనపై అనర్హత వేటు వేసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేసీఆర్ తో భేటీ తరువాతే చిక్కుల్లో పడ్డారు. ఆమె కేబినెట్ లో  మంత్రి అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. అరెస్టయ్యారు. కనీసం ఆయనకు మద్దతుగా మమత చిన్న ప్రకటన కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు.  ఇక ఆప్ విషయానికి వస్తే కేసీఆర్ తో భేటీల తరువాతే ఆ రాష్ట్రంలో లిక్కర్ స్కాం వెలుగులోనికి వచ్చి ఆ కుంభకోణం కేసులో ఏకంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఏ వన్ గా ఈడీ కేసు నమోదు చేసింది.  కారణాలేమైతేనేం కేసీఆర్ తో రాజకీయంగా కలిసి నడిచేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వివిధ పార్టీల నాయకులు ఒకరి తరువాత ఒకరుగా చిక్కుల్లో పడటంతో ఆయనతో కలిసేందుకు, భేటీ అయ్యేందుకూ జాతీయ స్థాయి రాజకీయాలపై చర్చించేందుకూ కూడా పార్టీలనాయకులు భయపడుతున్నారు. రాజకీయ నేతలలో ఆయనది ఐరన్ లెగ్ అన్నముద్రపడిందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.