టీజీ, ఏపీ… 2026 దాకా ఆగాల్సిందే అంటోన్న మోదీ సర్కార్!

Publish Date:Aug 2, 2017

Advertisement

 

రెండు తెలుగు రాష్ట్రాల నెత్తిన కేంద్రం మరో బాంబు వేసింది. రాష్ట్రాలు కాకపోయినా కనీసం ఇరు రాష్ట్రాల అధికార పక్షం నేతలకు మాత్రం నిరాశ మిగిల్చింది! ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు ఇద్దరూ కోరుకుంటున్న అసెంబ్లీ సీట్ల పెంపుకు క్లియర్ గా నో చెప్పేసింది! దాదాపు అయిపోయినట్టే అన్నట్లుగా వుండింది కొన్నాళ్ల కింద పరిస్థితి. ప్రధాని కార్యాలయం దాకా వెళ్లింది ఫైలు. అయినా మోదీ సర్కార్ చివరాఖరుకు నో చెప్పేసింది కేసీఆర్, చంద్రబాబు అభ్యర్థనకు!

 

ఎన్డీఏలో భాగస్వామిగా వున్న టీడీపీ ఏపీలో ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలనుకుంటోంది. అందుకే, బాబు అనేక సార్లు దిల్లీలో ప్రస్తావన తెచ్చారు. ఇక ఎన్డీఏలో లేకున్నా మోదీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తోన్న కేసీఆర్ కూడా పదే పదే నియోజకవర్గాల పెంపు గురించి మాట్లాడారు. ఈ మధ్య దిల్లీలో పర్యటించిన కేసీఆర్ అసెంబ్లీ సీట్ల పెంపు వుండదని తేల్చి చెప్పేశారు. అదే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి హన్స్ రాజ్ చెప్పారు! టీడీపీ ఎంపీ మురళీమోహన్ ప్రశ్నకు బదులుగానే తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పెంపుకు … 2026దాకా నో ఛాన్స్ అన్నారు!

 

కేంద్రం ఎమ్మెల్యేల సంఖ్య పెంచకపోవటానికి ప్రధాన కారణం ఆర్టికల్ 170(3) సవరించాల్సి వుండటమే. ఈ పని జరగాలంటే పార్లమెంట్లో చాలా పార్టీల మద్దతు కూడగట్టాలి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరిగినప్పుడు కాక ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల గురించి ఎమ్మెల్యేల సంఖ్య పెంచటం అనేక రాజకీయ గందరగోళాలకి దారి తీసే ఛాన్స్ కూడా వుంది. ఒరిస్సా, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా నియోజకవర్గాలు పెంచమని కోరుతున్నాయి. అవన్నీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల డిమాండ్ కు తలొగ్గితే తమ ఒత్తిడి కూడా పెంచవచ్చు. అంతే కాక బీజేపి తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పెంపుపై ఆసక్తి చూపకపోవటానికి రాజకీయ కారణం కూడా వుంది…

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో సీట్లు పెంచితే టీఆర్ఎస్, టీడీపీలకు లాభమని వాదన వినిపిస్తోంది. కొత్తగా వచ్చే ఎమ్మెల్యేల సీట్ల కోసం ఇతర పార్టీల్లోని బలమైన నేతలు అధికార పార్టీల్లోకి జంప్ చేసే ఛాన్సెస్ వున్నాయి. కాని, బీజేపికి ప్రత్యేకంగా లాభమంటూ లేదని గతంలో అమిత్ షా తెలంగాణ టూర్ అప్పుడు కొందరు నేతలు చెప్పారట. టీడీపీతో పొత్తు వున్న ఏపీ కాకపోయినా… తెలంగాణలో టీఆర్ఎస్ కు మేలు చేసే నిర్ణయం తామెందుకు తీసుకోవాలని బీజేపి పెద్దలు భావించి వుంటారు. అదీ కాక ఉభయ సభల్లో చాలా పార్టీల్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ చేయటం… ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక శ్రమగా కేంద్రం భావించి వుండవచ్చు!

 

మొత్తం మీద… నియోజకవర్గాల పెంపు ఆశలు గల్లంతు కావటంతో… తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రాజకీయ ఆశావహుల కలలు గల్లంతైనట్టే చెప్పుకోవచ్చు!

By
en-us Political News

  
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.