గాంధీల వీర విధేయుడి శకం… దిగ్విజయంగా ముగిసిపోతోందా?

Publish Date:Aug 1, 2017

Advertisement

         

కాంగ్రెస్ అనగానే ఇవాళ్ల దేశంలో గుర్తుకు వచ్చే ముఖాల్లో దిగ్విజయ్ ఒకరు! ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. అంతకు మించి లౌకికవాది. ముస్లిమ్ మైనార్టీల కోసం ఎంతకైనా తెగించి మాట్లాడటం ఆయన స్టైల్! కాని, ఎప్పుడో ఏళ్ల కిందట మధ్యప్రదేశ్ వదిలేసి దిల్లీ వెళ్లిన ఆయన మళ్లీ తన స్వంత రాష్ట్రం దిశగా చూపు సారించలేదు. కారణం… వివిధ రాష్ట్రాల్లో పార్టీ కోసం పని చేస్తూ సోనియా, రాహుల్ కు తలలో నాలుకలా మసలుకోవటమే! కాని, ఇప్పుడు అదే డిగ్గీ రాజా మెల్ల మెల్లగా పెవలియన్ దారి పడుతున్నాడా? తాజా పరిణామాలు దిగ్విజయ్ దిగ్విజయ యాత్ర ముగిసినట్టే అనిపించేలా సంకేతాలిస్తున్నాయి…

 

దిగ్విజయ్ చేతి నుంచి తెలంగాణ చేజారింది. అతడ్ని రాష్ట్ర ఇంఛార్జ్ గా తీసేసి కుంతియాను నియమించింది ఏఐసీసీ. ఇది కాంగ్రెస్ పార్టీలో పెద్ద వింతేం కాదు. చాలా సార్లు సీనియర్ నాయకుల్ని అటు ఇటు మారుస్తుంటారు కాంగ్రెస్ పెద్దలు. కాని, దిగ్విజయ్ ప్రజెంట్ కండీషన్ వేరు! ఆయన ప్రాభావం క్రమంగా తగ్గిపోతూ  వస్తోంది. అందుకే, ప్రభావమూ తగ్గించేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్!

 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో దిగ్విజయ్ సింగే తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్. అటు రాహుల్, సోనియా, ఇటు కేసీఆర్ అందరికి లింకుగా వుంటూ విభజన జరిపించారు. కాని, తరువాత పరిణామాలు తెలిసినవే. కేసీఆర్ కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయటం అటుంచితే… కనీసం పొత్తు కూడా పెట్టుకోలేదు. ఫలితంగా తెలంగాణ ఇచ్చి కూడా టీ కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితం అయింది. ఇక తరువాత ఈ మూళ్లలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ను ఏమాత్రం దూకించలేకపోయారు దిగ్విజయ్ సింగ్. పైగా అప్పుడప్పుడూ వివాదాస్పద ట్వీట్లతో రచ్చ మాత్రం చేసుకున్నారు…

 

ఓ సారి తెలంగాణ పోలీస్ శాఖని అనుమానించినట్టు మాట్లాడి గొడవ కొని తెచ్చుకున్నారు డిగ్గీ. మళ్లీ ఈ మధ్యే డ్రగ్స్ కేసుకి , కేటీఆర్ కి లింక్ పెట్టే ప్రయత్నం చేసి అనవసర రాద్దాంతం చేసుకున్నారు. ఇలా డిగ్గీ వల్ల తెలంగాణ కాంగ్రెస్ కి లాభం లేకపోగా నష్టం ఎదురవుతుండటంతో హైకమాండ్ కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే కాదు, తెలంగాణ నేతలు కూడా కొంత మంది దిగ్విజయ్ తీరుపై పార్టీ పెద్దలకి కంప్లైంట్ ఇచ్చారట! కాని, ఒక్క తెలంగాణ మాత్రమే కాదు… మొన్నా మధ్య గోవా కూడా దిగ్విజయ్ చేజారింది. అక్కడ అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీ చేత గవర్నమెంట్ ఏర్పాటు చేయించలేకపోయారు దిగ్విజయ్. మనోహరి పారికర్, నితిన్ గడ్కరీల ముందు ఈయన పాచికలు పారలేదు. అప్పుడు కూడా ఆగ్రహించిన కాంగ్రెస్ హై కమాండ్ ఆ రాష్ట్రాన్ని డిగ్గీ నుంచీ లాగేసుకుంది!

 

గాంధీలకి వీర విధేయుడని పేరున్న దిగ్విజయ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. స్వంత రాష్ట్రం మధ్యప్రదేశ్ లో ఏ మాత్రం విలువ లేకుండా పోయారు ఎప్పుడో! ఇక ఇప్పుడు దిల్లీలోనూ ఆయన శకం ముగిసినట్లు కనిపిస్తోంది. మరో వైపు ఆయనని ఇంత కాలం పోషిస్తూ వచ్చిన హస్తం పార్టీకే మోదీ, అమిత్ షా రూపంలో తీవ్రమైన ఒత్తిడి ఎదురువుతోంది! ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దిగ్విజయ్ అసలు వార్తల్లో వుంటారో వుండరో మరి?

By
en-us Political News

  
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.