360 డిగ్రీస్ లో రాటుతేలుతున్న లోకేష్!

Publish Date:Mar 7, 2025

Advertisement

మంత్రి నారా లోకేష్. అన్ని రకాలుగా రాటుతేలుతున్నట్టే కన్పిస్తోంది. నెమ్మదిగా విషయాలను అవగాహన చేసుకోవడంతోపాటు.. సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. రాజకీయంగా దూరదృష్టితో ఆలోచిస్తున్నట్టే కన్పిస్తోంది. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా వ్యవహరించిన లోకేషుకు.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి లోకేషుకు చాలా వ్యత్యాసం, పరిణితి కన్పించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక లోకేషులో అంతకు మించిన పరిణితి కన్పిస్తోంది. పార్టీ కార్యకర్తలతో వ్యవహరించే తీరు.. అసెంబ్లీలో ప్రతిపక్షంతో వ్యవహరిస్తోన్న తీరు.. లీడర్లను కంట్రోల్లో పెడుతున్న తీరుతో పాటు.. మిత్రపక్షాలతో ఎలా మెలగాలి అనే అంశం మీద కూడా లోకేష్ చాలా మెచ్యూర్డుగా ఆలోచన చేస్తున్నారు. వివిధ వేదికల మీద.. వివిధ సందర్భాల్లో నారా లోకేష్ వ్యవహరించిన తీరే.. ఆయనలో వచ్చిన పరిణితిని కనబడేలా చేస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను విశ్లేషిస్తే.. లోకేష్ పరిణితి ఏ స్థాయిలో సాధించాడో అర్థమవుతుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తర్వాత టీడీపీ కార్యాలయంలో ప్రజా విజయం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన అభ్యర్థి ఆలపాటి రాజా ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు లేచి నినాదాలు చేస్తున్నారు. దీంతో రాజా సీరియస్ అయ్యారు. కూర్చొ అంటూ సదురు కార్యకర్తను కొంచెం దురుసుగానే మాట్లాడారు. దీంతో సభకు హాజరైన వారికి కానీ.. టీవీల్లో చూస్తున్న వారికి కానీ కొంచెం తేడాగా అనిపించేలా ఉంది. గెలిచిన తర్వాత ఆలపాటి రాజాలో అహంకారం కన్పిస్తోందనే తీరులో ఆలపాటి రాజా హవాభావాలు ఉన్నాయి. దీన్ని వేదిక మీదే కూర్చొన్న లోకేష్ పసిగట్టారు. వెంటనే ఆయన తన సీట్లో నుంచి లేచి రాజా దగ్గరకు వచ్చారు.. కూర్చొమంటే కూర్చుంటామా..? తగ్గేదేలే.. అంటూ వాతావరణాన్ని చల్లబర్చారు.. అంతే కాకుండా.. హెడ్మాస్టరులా చెబితే వింటామా..? అంటూ నవ్వుతూనే ఆలపాటి రాజాకూ చురక వేశారు.

ఇక సభలో శాసన మండలిలో ప్రతిపక్షం మీద చాలా ఎగ్రెసివ్ గా వెళ్తున్నారు. ప్రతిపక్ష వైసీపీని సభలో ఇరుకున పెట్టేలా వ్యూహాలు రచించడమే కాకుండా.. తన తోటి సభ్యులకు స్పూర్తినిచ్చేలా వ్యవహరిస్తున్నారు. బొత్స లాంటి సీనియర్ పొలిటిషీయన్ను వివిధ సందర్భాల్లో కార్నర్ చేస్తున్నారు లోకేష్. అలాగే తన వాళ్ల బాగోగులను చూసుకుంటున్నారు. నిమ్మల రామానాయుడు అనారోగ్యంతోనే సభకు వచ్చేశారు. సభకు రావద్దు.. వెళ్లి రెస్ట్ తీసుకోండంటూ.. లాబీల్లో మంత్రి నిమ్మలకు సూచించడమే కాకుండా.. సభలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి.. మంత్రి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. మంత్రి నిమ్మల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారో చూడండనే విషయాన్ని ఇతర మంత్రులకు.. సభ్యులకు అర్థమయ్యేలా చేశారు లోకేష్. ఓ మంత్రి ఆరోగ్యం గురించి ఈ తరహాలో సభలో ప్రస్తావన రావడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి అనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరుగుతోంది.

ఇంతే కాదు.. మిత్రపక్షాలతో వ్యవహరించాల్సిన తీరు విషయంలో లోకేష్ విపరీతమైన మెచ్యూర్డ్ ప్రదర్శిస్తున్నారు. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేస్తే.. జనసేన నేతలకంటే ముందుగా స్పందించి.. కౌంటర్ ఇచ్చింది లోకేషే. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఏమైనా అంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరిక కూడా చేశారు పవన్. చంద్రబాబుకు.. పవనుకు ఎలాంటి గ్యాప్ లేదు.. కానీ పవనుకు, లోకేషుకు మధ్య గ్యాప్ వస్తుందేమోననే చర్చ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. అలాంటి అనుమానాలు అవసరం లేదనే రీతిలో పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే.. అందరికంటే ముందుగా లోకేష్ స్పందించిన తీరు కూటమి వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

ఈ విధంగా వివిధ సందర్భాల్లో మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు చూస్తూ.. చాలా తక్కువ సమయంలో తండ్రికి తగ్గ తనయుడు అనే పేరును లోకేష్ తెచ్చుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.