రాజకీయాలలో బ్రాహ్మణి ఎంట్రీ.. నిర్బంధాల నడుమ పుట్టుకొచ్చిన నవ నాయకురాలు!

Publish Date:Sep 27, 2023

Advertisement

అరెస్టులు, నిర్బంధాలతో తెలుగుదేశం దూకుడుకు కళ్లెం వేద్దామని చూస్తున్న జగన్ సర్కార్ కు కొత్త నాయకత్వం తెరమీదకు రావడం మింగుడు పడటం లేదు. అక్రమకేసు అయితేనేమి, నిలబడదని స్పష్టంగా తెలిస్తేనేమి.. ఏదో విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని అరెస్టు చేసేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మరో విచిత్రమైన కేసులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్టు చేయాలని చూస్తోంది. ఈ ఇద్దరి అరెస్టుతో జనంలోకి బలంగా వెళ్లే నాయకులు లేకుండా చేయొచ్చనీ, తెలుగుదేశం ఎన్నికల ముందరు డీలా పడుతుందనీ ఆశించింది. అయితే చంద్రబాబు అరెస్టుకు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతి దేశంలో నిరసనలు వెల్లువెత్తడంతో కంగుతింది. ఇక నష్ట నివారణ ఎటూ సాధ్యం కాదు.. ఇదే ఒరవడిని కొనసాగించి నోరున్న నాయకులందర్నీ నిర్బంధించి.. ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్లే వ్యూహానికి తెరతీసింది. అందులో భాగంగానే  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటూ నారా లోకేష్ ను ఏ14గా చేర్చింది. ఇక ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ రోడ్లపైకి వస్తే అరెస్టులేనన్న సంకేతాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. నాలుగేళ్లుగా ప్రభుత్వ వేధింపులను, దమనకాండను, అప్రజాస్వామిక విధానాలను గట్టిగా ఎదిరించి నిలబడిన తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలను నిర్బంధిస్తే నీరుగారిపోతుందని ఆశిస్తున్నది. 

అయితే తెలుగుదేశం పార్టీ నిర్బంధాలను ఎదరించి నిలబడే విషయంలో చాలా గట్టిగా ఉంది. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ జగన్ సర్కార్ నిర్బంధకాండనే  నమ్ముకుంటుందని ముందుగానే ఊహించింది. అధినేత చంద్రబాబు తన అరెస్టును ముందుగానే ఊహించారు. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పి.. ఏదో అక్రమ కేసులో నన్ను అరెస్టు చేస్తారు. భయపడకుండా ఒకే సారి న్యాయపోరాటం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ నేతలను, కేడర్ ను ముందుగానే సన్నద్ధం చేశారు. వరుస అరెస్టులతో భయానక వాతావరణం సృష్టించే వ్యూహంలో  అధికార జగన్ పార్టీ ఉందని ఆయన నాయకులు, శ్రేణులను ముందుగానే హెచ్చరించారు. ప్రతి కార్యకర్తా ముందుండి పార్టీని నడిపించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదన్నట్లుగా తెలుగుదేశం పార్టీని ఆయన సిద్ధం చేశారు.

ఇప్పుడు చంద్రబాబును స్కిల్ స్కాం అంటూ అడ్డగోలుగా అరెస్టు చేసినా తెలుగుదేశం పోరాట పటిమను ఇసుమంతైనా కోల్పోలేదు. యువగళం పాదయాత్రతో ప్రజాబాహుల్యం మన్ననలు అందుకుంటూ, అశేష ప్రజాభిమానంతో ముందుకు సాగుతున్న పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను నిర్బంధించేందుకు అధికార వైసీపీ రంగం సిద్ధం చేసిన తరుణంలో మరో యువ నాయకురాలు ముందుకు వచ్చారు. ఆమే నారా బ్రాహ్మణి. తెలుగుదేశం అగ్రనేతలను ఆధారాలు లేని కేసుల్లో జైల్లో పెట్టి.. వారికి బెయిలు రాకుండా వ్యవస్థలను మేజేన్ చేస్తున్నా పార్టీలో ధైర్యం, స్థైర్యం ఇసుమంతైనా సడలదని బ్రాహ్మణి విస్ఫష్టంగా చాటారు.  నారా బ్రాహ్మణి వైఫ్ ఆఫ్ నారా లోకేష్, డాటర్ ఇన్ లా ఆఫ్ చంద్రబాబు అండ్ డాటర్ ఆఫ్ బాలయ్య. నారా, నందమూరి కుటుంబాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నారా బ్రాహ్మణి తొలి మీడియా సమావేశంలోనే సూటిగా సుత్తి లేకుండా జగన్ రెడ్డి సర్కార్ ఆగడాలను ఎండగట్టారు.

తడబాటు, తొట్రుపాటు లేకుండా మీడియా ముందు పార్టీ పోరాట పటిమను ఆవిష్కరించారు. మీడియా సమావేశంతోనే సరిపెట్టకుండా ప్రజా సమస్యలపైనా, ప్రభుత్వ దమనకాండపైనా ఘాటు విమర్శలతో సామాజిక మాధ్యమం వేదికగా ప్రజలలో చైతన్యం రగులుస్తున్నారు.  అంగన్‌వాడి మహిళలు, టీడీపీ మహిళా నేత పరిటాల సునీత పై పోలీసుల తీరును గర్హించారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీల్లో ప్రభుత్వ ప్రేరేపిత హింస  షాక్ కు గురి చేసిందంటూ ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగిన అంగన్‌వాడి కార్మికులపై పోలీసు దాడులు దుర్మార్గం, అప్రజాస్వామికం అని విమర్శించారు.. న్యాయం కోసం మహిళా నేతలు శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతూంటే.. వారిపై దాడులకు పాల్పడటం శోచనీయమంటూ బ్రాహ్మణి సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ప్రజలను కదిలిస్తున్నాయి.  నారా బ్రాహ్మణి పార్టీ సమావేశాలలో పాల్గొంటున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నేతలతో చర్చిస్తున్నారు. ఆ చర్చలలో బ్రాహ్మణి పరిణితి చూసి నేతలే విస్తుపోతున్నారు.  జనసేన నేతలతోనూ చర్చలు జరుపుతున్నారు. అటు ఐటీ ఉద్యోగులనూ కలుస్తున్నారు.  

నిత్యం పార్టీ వ్యవహారాలపై చర్చలు జరుపుతున్నారు, సమాలోచనలు చేస్తున్నారు.  ఒక వేళ లోకేష్ ను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినా పార్టీ కేడర్ లో స్థైర్యం చెదరకుండా, ధైర్యం సడల కుండా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. క్రమశిక్షణ, స్థిర చిత్తం, ప్రజలలో కదలిక తీసుకురాగలిగే వాగ్ధాటితో బ్రాహ్మణి తెలుగుదేశం శ్రేణులలోనే కాదు, చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న జనాలకు కూడా ధైర్యాన్నీ స్థైర్యాన్నీ ఇస్తున్నారు.   

 ఇప్పటి వరకూ ఆమె   కుటుంబ వ్యాపారం చూసుకుంటున్నారు. అయితే  సంక్షోభ సమయంలో తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక నాయకురాలిగా ఆవిర్భవించారు.   ఇప్పటి వరకూ రాజకీయాల ఊసే ఎత్తని నారా బ్రహ్మణి ధైర్యంగా నేనున్నానంటూ ముందుకు వచ్చారు. భర్తను అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. అక్రమాలను, అన్యాయాలను సహించబోమంటూ.. పార్టీని నడిపించేందుకు తాను జనంలోకి వస్తానంటూ ముందుకు వచ్చారు. ఒక్క మీడియా సమావేశంతో ఆమె రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నారు. మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు నదురూబెదురూ లేకుండా ఆమె ఇచ్చిన సమాధానాలు అందరికీ ఆకట్టుకున్నాయి. స్పష్టమైన అవగాహనతో  జగన్ సర్కార్ తీరును ఎండగట్టిన తీరు బ్రాహ్మణిలోని నాయకత్వ పటిమను ఎత్తి చూపింది. తెలుగుదేశం అధినేత  చంద్రబాబును అరెస్టు చేయడంలోని ఔచిత్యాన్ని ఆమె  ప్రశ్నించిన తీరు ఆమెలోని నాయకత్వ లక్షణాలను బహిర్గతం చేశాయి.  ఇంత కాలం హెరిటేజ్ వ్యవహారాలు చూసుకునే యువ వ్యాపార వేత్తగా మాత్రమే అందరికీ తెలిసిన బ్రాహ్మణి.. రాజమహేంద్రవరంలో మీడియా ఎదుట స్కిల్ స్కామ్ పేరుతో జగన్ సర్కార్ ఎంత అడ్డగోలుగా, ఎంత అప్రజాస్వామికంగా తన మామ, పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిందో వివరించిన తీరు.. పొలిటికల్ గా ఆమె పరిణితికి అద్దం పట్టాయి. మొత్తం మీద నారా బ్రాహ్మణి నందమూరి, నారా కుటుంబాల నుంచి వచ్చిన మరో సమర్ధవంతమైన, ప్రతిభామంతమైన నాయకురాలిగా జనం మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో సందేహం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.