మల్లాది ఆవేశానికి కారణాలు ఏమిటో?

Publish Date:Mar 30, 2012

Advertisement

నందిగామ శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు, తన సహచర శాసనసభ్యుడైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన మల్లాది విష్ణుపై పోలీసు కేసు నమోదు చేయడం కృష్ణాజిల్లాలో పెద్దచర్చనీయాంశంగా మారింది. ఒక శాసన సభ్యునిపై మరొక శాసన సభ్యుడు పోలీసు కేసు పెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం కావడమే కాకుండా ఇరువురు కృష్ణాజిల్లాకు చెందినవారే కావడం విశేషం. గృహనిర్మాణ శాఖకు సంబంధించి హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో తనపైకి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ తంగిరాల ప్రభాకరరావు పోలీసు కేసు పెట్టారు. అయితే సమావేశంలో శాసనసభ్యుడు విష్ణు ఆవేశపడటానికి, ప్రభాకర్ పోలీసు కేసు పెట్టడం వెనుక ఇతరత్రా అంశాలు వున్నాయని, గృహ నిర్మాణ సమావేశం ఒక సాకు మాత్రమేనని జిల్లాకు చెందిన ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

 

2009లో జరిగిన ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో వున్న 16 స్థానాలకుగాను మెజారిటీ స్థానాల్లో అంతే జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గుడివాడ, కైకలూరు, నూజివీడు, గన్నవరం, అవనిగడ్డ (8)లలో తెలుగుదేశంపార్టీ విజయం సాధించగా, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల నుంచి పి ఆర్ పి, విజయవాడ సెంట్రల్, తిరువూరు, మచిలీపట్నం, పెడన, పామర్రు, పెనమలూరులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల పి ఆర్ పి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన నేపథ్యంలో కృష్ణాజిల్లా అధికార, ప్రతిపక్ష సభ్యుల సంఖ్యంగా చేరిసమం అయ్యింది. సభ్యుల సంఖ్య చేరిసమం అయినప్పటికీ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, మైలవరం శాసనసభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావుకు అధికార పార్టీ శాసనసభ్యుల కంటే ఎక్కువగా గుర్తింపు వుంది. దేవినేనికి నందిగామ శాసన సభ్యుడైన తంగిరాల ప్రభాకరరావు, అత్యంత సన్నిహితులు. జిల్లాలో జరిగే ఏ కార్యక్రమంలో అయినా తంగిరాల, దేవినేనితో కలిసి పాల్గొనడమే కాకుండా అధికారపార్టీకి చెందిన శాసనసభ్యులను విమర్శించడంలో, వారిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడటంలో ముందుంటారు. కృష్ణాజిల్లాలో ఒక విధంగా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్ లతోపాటు మంత్రి కె.పార్థసారధి ఒక జట్టుగా వ్యవహరిస్తుండగా ప్రతిపక్ష పార్టీకి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల ప్రభాకరరావు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్యలు ఒక జట్టుగా వ్యవహరిస్తూ ఏ చిన్న అవకాశం వచ్చినా పరస్పరం ఒకరిపై మరొకరు మాటలతో దాడి చేసుకోవడం ఆనవాయితీగా మారింది. తెలుగుదేశంపార్టీకి చెందిన నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య ప్రసంగంతో సమావేశంలో రగడ ప్రారంభమైనా అది చివరకు పార్టీల మధ్య, ఆ తర్వాత వ్యక్తుల మధ్య రగడగా మారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 

 

By
en-us Political News

  
రాష్ట్రంలో కనిపిస్తున్న కరవు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల తలెత్తినవి కావన్నారు.  ఇందుకు పూర్తిగా రేవంత్ సర్కార్  అసమర్థ  విధానాలే కారణమని విమర్శించారు.  కృష్ణా నదీ జలాల నిర్వహణ,  వాటిని వినియోగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.  
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 23లో ఓ వినియోగదా రురాలు తాగునీటిని ఫ్లోర్‌ క్లీనింగ్‌ కోసం వినియోగిస్తు న్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీంతో నిబంధనల మేరకు అధికారులు  ఆమెకు   జరిమానా విధించారు. తాగునీటిని రోడ్లు, ఫ్లోర్‌లు కడగడం వంటి అవసరాలకు వినియోగించడంపై జలమండలి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 స్టేషన్‌ బయట సదరు కానిస్టేబుల్‌ ఓ మహిళను కర్రతో కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తు న్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో కానిస్టేబుల్‌ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాలా కబ్జాలు, బఫర్ జోన్ ఆక్రమణలు జరిగాయని గతంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త సర్వేలో సుమారు 14 గుంటల మేర నాలా ఆక్రమణ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు   రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామైన మెట్టుగడ్డ  విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.   ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్రంగా గాయపడ్డాడు.
రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దేవరయంజాల్ సర్వే నంబర్ 437 పరిధిలో ఉన్న ఆ ఒక్క ఎకరం వ్యవసాయ భూమి విలువ నాటి అఫిడవిట్ లో  50 వేల రూపాయలుగా ఉంది.  
ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ  ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అరవింద్‌ కుమార్‌ను ఏ 2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డీని ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.