మళ్ళీ వస్తా.. మాట్లాడు కుందాం.. నల్లారి రీ ఎంట్రీ సంకేతం

Publish Date:Jun 24, 2022

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, విభజన అనంతరం రాజకీయంగా తెరమరుగై పోయారు. రాష్ట్ర విభజన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ పెట్టారు.2014 అసెంబ్లీ ఎన్నికలలో, చెప్పు గుర్తు, సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేశారు. అయితే, పార్లమెంట్ ఆమోదంతో, రాజ్యాంగ బద్దంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, సమైక్యాంధ్ర నినాదం ఇచ్చి ఏమి ప్రయోజనమని ప్రజలు, ఆయన గుర్తుతోనే ఆయనకు   సమాధాన మిచ్చారు. రాజీనామా చేయవలసిన సమయంలో ముఖ్యమంత్రి పదవి పట్టుకు వేళ్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు  రాష్ట్ర విభజన  జరిగిపోయిన తర్వాత  బయటకు రావడాన్ని  జనం జీర్ణించుకోలేక పోయారు. అందుకే  ఆయన్ని పట్టిచుకోలేదు. ఆ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి ఘోరంగా ఓడి పోయారు.ఇక అక్కడ నుంచి  ఆయన రాజకీయాలకు దూరంగా దాదాసే అజ్ఞాతవాసంలోకి వెళ్లి పోయారు. 

ఈ ఎనిమిదేళ్ళ కాలంలో  అప్పుడో సారి .. ఇప్పుడో సారి ఒకరి రెండు సందర్భాలలో ఆయన పేరు రాజకీయ చర్చల్లో వినిపించినా, ఆయన మాత్రం ఎక్కడా క్రియాశీలంగా కనిపించలేదు. అయిన బీజేపీలో చేరుతున్నారని లేదు ఇంకేదో పార్టీలో చేరుతున్నారని రాజకీయ చర్చలో వినిపించినా, అలాంటిదేమీ జరగలేదు. అందుకే ఆయన రాజకీయ జీవితానికి తెర పడినట్లేనని విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. మధ్యలో 2018లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు, అయినా ఆ తర్వాత కూడా ఆయన సైలెంట్‌గానే ఉండిపోయారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన్ని పిలిపించి పీసీసీ బాధ్యతలు చేపట్టమని అడిగినట్లు వార్తలొచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని వ్యక్తిగత పనుల మీదనే ఢిల్లీ వచ్చిన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు చెప్పారు. అయితే, ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.

దీంతో, ఆయన మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారనీ, సోనియా గాంధీ ఆయనకు కీలక బాధ్యతలు ఆఫర్ చేశారనే చర్చ మొదలైంది.  అదలా ఉంటే తాజాగా, ఆయన సొంత జిల్లా అన్నమయ్య ( చిత్తూరు) జిల్లాకు రావడంతో మళ్ళీ మరోమారు, నల్లారి వార్తల్లో కనిపించారు. నిజానికి ఆయన తమ స్వగ్రామం నగరిపల్లెలో కొన్న  భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం అక్కడికి వెళ్ళారే కానీ రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేందుకు వెళ్ళలేదు. భూమి కొనుగోలువ్యవహారం కాబట్టే, ఆయన వెంట కుమారుడు, నిఖిలేశ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

అయితే, ఈసందర్భంగా ఆయనకు ఏపీసీసీ కార్యదర్శి అఘామోహిద్దీన్, జిల్లా కాంగ్రెస్ నేత శ్రీవర్ధన్, పలువురు నేతలు, కార్యకర్తలు అభిమానులు  స్వాగతం పలికారు. అయన వారిని పలరించారు. ఇవన్నీ సహజంగా, ఏ నాయకుడు, (మాజీ అయినా) జరిగే తంతే, అందులోనూ  మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. నల్లారి విషయంలోనూ అదే జరిగింది. అయితే,  ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో, ‘త్వరలోనే మళ్లీ వస్తా.. అందరినీ కలుస్తా.. ఇకపై అందుబాటులోనే ఉంటా.. అప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుందాం..’అంటూ ఆయన పలికిన వీడ్కోలు పలుకులు, రాజకీయ వర్గాల్లో ఉహాగానాలకు తెర తీశాయి.

ఆయన మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తుందని, అందుకే ఆయన మళ్ళీ వస్తా .. మాట్లాడుకుందాం  అన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే  నిజంగా, అయన రీ ఎంట్రీ ఇస్తారా ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికిస్తారా? బతికించ గలరా? అంటే, ఆయన రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఎలా ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించడం మాత్రం, ఇప్పట్లో అయ్యేపని కాదని, అ మాట  కొస్తే, కాంగ్రెస్సే కాదు బీజేపే సహా ఏ జాతీయ పార్టీకి ఇప్పట్లో ఎపీలోకి ఎంట్రీ చిక్కదని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.