ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ లో అత్యంత కీలక భాగస్వామి జనసేన అనడంలో సందేహం లేదు. ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ.. పొత్తులో భాగంగా జనసేన త్యాగాలకు సిద్ధపడి అన్ని స్థానాలలోనే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. ఆ ఎన్నికలలో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు సృష్టించింది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీసీ సర్కార్ ఎన్నికలలో పరాజయం కావడానికి జనసేన చొరవ తీసుకుని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, బీజేపీని కూడా పొత్తులోకి తీసుకురావడం కూడా ఇక కారణం. ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఇప్పుడు జనంలో మమేకం కావడానికి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. జనంలోకి జనసేన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా జనసేన పుంగనూరు నియోజకవర్గంలో ఆదివారం భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు హాజరయ్యారు. అసలు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ఆయనే ముందుండి నడిపించనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అయిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా పుంగనూరు సమావేశంలో నాగబాబు విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినిక అడవి దొంగగా అభివర్ణించారు. మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటన వెనుక కుట్ర ఉందని.. ఆ కుట్రదారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
పుంగనూరు పుడింగిగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుర్మార్గాలు, దురాగతాలపై తనకు వివరించిన స్థానికులు ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండాలని తనకు సూచించారని చెప్పిన నాగబాబు తనకు భయం లేదని చెప్పారు. పెద్దిరెడ్డి కాదు.. వైసిపీ అధినేత జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా తాను భయపడలేదనీ, ఆఫ్ట్రాల్ పెద్దిరెడ్డి ఎంత అని అన్నారు. నీతిగా, నిజాయతీగా ఉండే వారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న నాగబాబు.. జనసేనాని పవన్ కల్యాణ్ నాయకత్వంలో జనసేన క్యాడర్, లీడర్ అందరూ కూడా నీతి మార్గాన్నే అనుసరిస్తారన్న పవన్ కల్యాణ్ అందుకే జనసేన పార్టీకి భయమన్నదే లేదని ఉద్ఘాటించారు.
తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పెద్దిరెడ్డిపై విమర్శల దాడిని ఉధృతం చేసిన నాగబాబు గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టారని ఆరోపించారు. జనం ఓడించిన తరువాత ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాలేదనీ, ప్రజలకు మొహం చాటేసి భయంభయంగా నక్కినక్కి బతుకీడుస్తారని ఎద్దేవా చేశారు. జగన్ కే కాదు జగన్ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీకి హాజరై ప్రజల తరఫున మాట్లాడే ధైర్యం లేదని నాగబాబు దుయ్యబట్టారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన సాగిస్తోం దన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా చేస్తోందన్నారు. పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్ సర్కార్ కు నాలుగేళ్లు పడితే.. ఎన్డీయే కూటమి సర్కార్ ఆ పని ఒకే సారి చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ కూటమి సర్కార్ అమలు చేస్తుందనీ, ఒక్కటొక్కటిగా ఒక్కో హామీనీ నెరవేరుస్తూ వస్తోందని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nagababu-criticse-peddaireddy-ramachandrareddy-25-192279.html
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.