సీజేఐకి కొడి కత్తి కేసు నిందితుడి తల్లి లేఖ

Publish Date:Jul 9, 2022

Advertisement

ఏరు దాటే వరకూ ఓడ మల్లయ్య... ఏరు దాటిన తరువాత  బోడి మల్లయ్య అన్న తీరు వైసీపీ అధినేత జగన్ ది. బాబాయ్ హత్య కేసు విచారణ సీబీఐతో జరిపించాలని విపక్ష నేతగా డిమాండ్ చేసిన ఆయన ఆ తరువాత స్వయంగా సీబీఐ విచారణ అవసరం లేదని అనేశారు.

అలాగే కోడి కత్తి కేసులో కూడా విపక్షం తనపై హత్యాయత్నం చేయించిందంటూ విపక్ష నేతగా ఊరూవాడా ఏకం చేసింన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు ఊసెత్తడమే మానేశారు. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. కోడి కత్తి కేసు గుర్తుందా?  విపక్ష నేతగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ హైదరాబాద్ వచ్చేందుకు విశాఖ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఓ యువకుడు ఆయనపై దాడి చేశారు. ఆ దాడిలో జగన్ కు స్వల్ప గాయమైంది. ఈ దాడిని ఓ యువకుడు కోడి కత్తితో చేశాడు. అందుకే  ఆ కేసును అందరూ కోడి కత్తి కేసుగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఈ దాడి వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారంటూ వైసీపీ ఆరోపణలు సైతం గుప్పించింది. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. బాబు పాలనలో తనకు రక్షణ లేదంటూ జగన్ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదన్నారు. దీంతో ఈ కేసు విచారణకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. అదంతా వేరే సంగతి.   ఈ సంఘటన తరువాత కోడి కత్తితో దాడికి పాల్పడిన శ్రీనివాస్ అనే  యువకుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సరే ఈ ఘటన జరిగి సంవత్సరాలైపోయింది.

ఇప్పుడీ కేసు ప్రస్తావన ఎందుకంటే   కోడి కత్తితో దాడికి పాల్పడిన శ్రీనివాస్ తల్లి సావిత్రి తన కుమారుడు నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్నాడనీ, అతడిని  తక్షణమే విడుదల చేయాలనీ కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖ రాశారు. నాలుగేళ్లుగా తన కుమారుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడనీ, ఈ కేసు విషయంలో న్యాయస్థానం కానీ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కానీ ఎటువంటి విచారణ జరపడం లేదని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల ముందు జరిగిన కోడి కత్తి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం పూర్తిగా వినియోగించుకున్న జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసును పట్టించుకోవడమే మానేశారు. తనపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారు అన్నది తేల్చాలన్న నాటి డిమాండ్ ను పూర్తిగా మర్చిపోయారు.  నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న తన కుమారుడిని విడిపించాలంటూ.. శ్రీనివాస్ తల్లి సావిత్రి సీజేఐకి లేఖ రాయడంతో మళ్లీ ఆ కేసు తెరమీదకు వచ్చి

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.