Publish Date:Oct 27, 2022
వివాదాస్పద దర్శకుడు రామగోపాల్ వర్మ తన కొత్త సినిమా వివరాలను వెల్లడించారు. బుధవారం(అక్టోబర్ 26) నాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఏపీ సీఎం జగన్ తో భేటీ అనంతరం సినీ, రాజకీయ వర్గాలలో వెల్లువెత్తిన ఊహాగానాలను రామ్ గోపాల్ వర్మ గురువారం (అక్టోబర్ 27) ఫుల్ స్టాప్ పెట్టారు. తాను త్వరలో ఒక రాజకీయ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తేటతెల్లం చేశారు.
పార్ట్ వన్ పార్ట్ టూగా రూపొందనున్న తన కొత్త సినిమా బయోపిక్ కాదనీ, అంతకు మించిన రియల్ పిక్ అనీ చెప్పారు. ఈ చిత్రానికి తనతో గతంలో వంగవీటి సినిమా నిర్మించిన దాసరి కిరణ్ దర్శకుడని వెల్లడించారు. ఈ సినిమా మొదటి భాగం టైటిల్ వ్యూహం అనీ రెండో భాగం టైటిల్ శపథం అనీ వెల్లడించారు. ఈ రెండు భాగాలలోనూ రాజకీయ, అరాచకాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లలో అహంకారానికి ఆశయానికీ మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన కథే వ్యూహం అని వివరించారు. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందనీ రాచకురుపుపై వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ఉంటుందనీ వివరించారు. ఇక రెండో భాగం శపథం మరింత తీవ్రంగా ఎలక్ట్రిక్ షాక్ తగిలే లా ఉంటుందనీ రామ్ గోపాల్ వర్మ వివరించారు.
వర్మ ఏపీ సీఎం జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో బుధవారం(అక్టోబర్ 26) భేటీ అయిన సంగతి విదితమే. సీఎంతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన రామ్ గోపాల్ వర్మ ఆ మరుసటి రోజే అంటే గురువారం (అక్టోబర్ 27) రాజకీయ చిత్రం రూపొందించనున్నట్లు ప్రకటించి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
2014 ఎన్నికలకు ముందు కూడా జగన్ కు అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న చిత్రం విడుదల చేసిన సంగతి విదితమే. కాగా వర్మ తన రాజకీయ చిత్రం పై ఉహాగానాల నేపథ్యంలో బీజేపీ ఏపీ కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి బుధవారమే (అక్టోబర్26) స్పందించారు. రామ్ గోపాల్ వర్మ వ్యక్తులనూ, పార్టీలనూ టార్గెట్ చేస్తూ సినిమాలను తెరకెక్కించారనీ, మరో సారి అదే చేయబోతున్నారనీ పేర్కొన్నారు. ఆయనను ఇటువంటి సినిమాలు తీయాలని ప్రోత్సహించే వారికి రాజకీయాలలో హత్యలు ఉండవు... ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయన్న నానుడి అతికినట్టు సరిపోతుందని ట్వీట్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/my-moovie-is-more-than-biopic-it-is-realpic-39-146136.html
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.