మూసీ ప్రక్షాళనకు శ్రీకారం.. రియాల్టీలోకి రానున్న రేవంత్ అభీష్టం

Publish Date:Aug 12, 2025

Advertisement

వీకెండ్ లో మూసీ క్లీన్ వాటర్ లో బోటింగ్ కు వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. చుట్టూ గ్రీనరీ.. ఐకానిక్ టవర్లు.. సరికొత్తగా బ్రిడ్జిలు.. మధ్యలో బోటింగ్.. మన హైదరాబాద్ లో ఈ సీన్ ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా.. మరి ఇది నిజమైతే ఎలా ఉంటుంది? మూసీ మురుగు, దుర్గంధం, ఇంకో వైపు పొల్యూషన్ ఇలా రకరకాల సమస్యల్లో ఉండే సగటు హైదరాబాదీకి ఫుల్ రిలాక్సేషన్ ఇవ్వడం పక్కా. అయితే అసాధ్యం అనుకున్న ఈ పనిని సుసాధ్యం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇన్నాళ్లూ పేపర్ వర్క్ గా జరిగింది.. ఇప్పుడు రియాల్టీ కాబోతోంది. 
హైదరాబాద్ సిటీ నడి మధ్యలోనుంచి మూసీ వెళ్తుంది. గండిపేట్ వరకు ఓకే.. ఆ తర్వాతే మూసీ దుర్గంధభరితంగా మారుతుంది. సిటీలోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఉంటుంది. ఇదంతా బాగు పడితే ఒక అద్భుతమే అవుతుంది. భవిష్యత్ తరాలకు చాలా మేలు జరుగుతుంది. మూసీ నది ఓ సబర్మతిగా మారాలి. లండన్ థేమ్స్ మాదిరి వెలిగిపోవాలి. ఇలా జరగాలంటే మాటలు కాదు. పెద్ద ఎత్తున నిధులూ అవసరమే. వచ్చే నిధులతో మూసీకి అటు ఇటు బ్యూటిఫికేషన్ చేసి వదిలేస్తే సరిపోదు. అందులో ప్రవహించే నీళ్లు కూడా అద్భుతంగా ఉండాలి. అదే ఇప్పుడు వాస్తవంలోకి రాబోతోంది.

ఇన్నాళ్లూ జరిగిన పేపర్ వర్క్ ముగిసింది. ఇప్పుడు అసలు వర్క్ మొదలు కాబోతోంది. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 4,100 కోట్ల రూపాయల రుణాన్ని అందించబోతోంది. ఈ రుణంతో హైదరాబాద్ సిటీలో 55 కిలోమీటర్లు ప్రవహించే మూసీ నది పునరుజ్జీవనానికి ఉపయోగపడబోతోంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం సిటీని వరదలు లేని నగరంగా మార్చడం, మూసీ ఒడ్డున పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం, నీటి కాలుష్యాన్ని తగ్గించడం వంటివి ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 2,050 కోట్లను ఏడీబీ ఇవ్వబోతోంది. ఇక రెండో విడతలో మిగిలిన 2,050 కోట్లు ఇస్తారు. వీటితో నది శుద్ధి, కొత్త సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం, ఆక్రమణల తొలగింపు, రివర్‌ఫ్రంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్  చేపడతారు. 

లండన్ థేమ్స్ మాదిరి, అహ్మదాబాద్ సబర్మతి మాదిరి హైదరాబాద్ మూసీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో సంకల్పించుకున్నారు. లండన్, సౌత్ కొరియా, జపాన్ సహా చాలా చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి నదులు ఎలా పునరుజ్జీవం అయ్యాయో గుర్తించారు. మన అవసరాలకు తగ్గట్లు మూసీని డెవలప్ చేయాలని నిర్ణయించారు. నిజానికి మూసీని బాగు చేయాలని గతంలో ఆలోచనలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. కేవలం అక్కడక్కడ బ్యూటిఫికేషన్ కు మాత్రమే పరిమితం అయ్యాయి.  నదిలో నీళ్లు బాగుండాలి. అంటే పరిశ్రమలు, గృహ వ్యర్థాలు అందులో కలవకూడదు. అప్పుడే మూసీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది.  సో రేవంత్ రెడ్డి  అక్కడి నుంచే పనులు షురూ చేయబోతున్నారు. 

మూసీ నదిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేయడానికి 39 కొత్త సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మిస్తారు. నది ఒడ్డున రైతు మార్కెట్‌లు, నైట్ మార్కెట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు, బోటింగ్ సౌకర్యాలు, రిలాక్సేషన్ జోన్లు ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయి. నది నీటిని శుద్ధి చేసి రకరకాల అవసరాల కోసం వాడేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి దశలో ప్రాజెక్టు బాపూ ఘాట్ నుంచి  21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి చేస్తారు. సింగపూర్‌కు చెందిన మీన్‌హార్డ్ గ్రూప్‌ను డీపీఆర్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం  నియమించింది. 

మూసీ పునరుజ్జీవం పట్టాలెక్కాలంటే  రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. అందుకే సీఎం రేవంత్ మొదటగా ఏమేం చేస్తే వర్కవుట్ అవుతుందో అవన్నీ అమలు చేశారు. మొదట నదీ గర్భంలో ఉన్న వారిని ఇమీడియట్ గా ఖాళీ చేయించారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు. సామాన్లు తరలించేందుకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు. హైడ్రాతో చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ నుండి ఉస్మానియా హాస్పిటల్ దాకా ఆక్రమణలను తొలగించారు. మొదటి దశలో 13ఎస్టీపీలను నిర్మించడం ద్వారా రోజుకు 970 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. రెండో దశలో మిగిలిన 34 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి కొనసాగుతుంది. ఇందులో పర్యాటక సౌకర్యాలు, వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. 

సీఎం రేవంత్ రెడ్డి హెచ్‌ఎండీ అధికారులతో చేసిన రివ్యూలో ఇటీవలే కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ వరదలకు విముక్తి జరగాలంటే అది మూసీ పునరుజ్జీవంతోనే అని క్లారిఫికేషన్ ఇచ్చారు. మూసీ అభివృద్ధికి ఐకానిక్ డిజైన్‌ను ఎంచుకోనున్నారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేసే విషయంలో సబర్మతి మోడల్‌ను ఫాలో కావాలన్నారు. మూసీ పరివాహకంలో ఉన్న వారికి సరైన పరిహారం అందించి.. మొత్తం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రలక్ష్యంగా పెట్టుకున్నారు. నిజంగా అది సాకారమైతే హైదరాబాద్ వాసులకు పండుగే.

By
en-us Political News

  
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.