Publish Date:Jan 16, 2026
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తోంది. ఏపీలో 16 ఎంపీలు టీడీపీకి ఉండగా, ఇద్దరు జనసేన, ముగ్గురు బీజేపీ, నలుగురు వైసీపీకి ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పెమ్మసాని, రామ్మోహన్ రూపంలో కేంద్రంలో మంత్రి పదవులుండగా.. బీజేపీ నుంచి శ్రీనివాసవర్మ కూడా కేబినేట్ లో సహాయ హోదాలో ఉన్నారు. అంటే ఏపీకి ముగ్గురికి అవకాశం లభించింది తొలి మంత్రి వర్గంలోనే వీరు స్థానం సంపాదించారు.
అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి ఏపీకి,, మరీ ముఖ్యంగా టీడీపీకి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ లభించేలా తెలుస్తోంది. మొన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అమిత్ షాతో భేటీలో ఈ విషయం ఆయన చెవిలో వేసి వచ్చారు. దీంతో ప్రతిపాదనలు పంపమని కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. దీంతో చంద్రబాబు టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కుల సమీకరణల్లో భాగంగా ఈ సారికి ఒక రెడ్డి సామాజికవర్గం పేరు ప్రతిపాదించినట్టు కనిపిస్తోంది.
గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి రాగానే నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంతే కాకుండా ప్రకాశం జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలోనూ వేమిరెడ్డి ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. దీంతో వేమిరెడ్డికి కేంద్ర మంత్రిత్వం కట్టబెడితే ఆయన ద్వారా రెండు జిల్లాలను కవర్ చేసినట్టుగా ఉంటుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆయన పేరు కేంద్ర మంత్రిగా సిఫార్సు చేసినట్టు కనిపిస్తోంది.
ఇక జనసేనకుగానీ ఒక మంత్రి పదవే ఇస్తే.. బాలశౌరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఏపీకి రెండు కేంద్ర పదవులు ఇస్తారన్న మాట కూడా జోరుగాననే ప్రచారం సాగుతోంది. ఒక దశలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వేమిరెడ్డితో పాటు వినిపించినప్పటికీ.. వేమిరెడ్డికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. కారణం వేమిరెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా జిల్లాలో ప్రభావవంతమైన నాయకత్వం వహించడం.. వంటి అంశాలను పరిగణలోకి తీస్కున్న అధిష్టానం వేమిరెడ్డికే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-vemireddy-prabhakar-reddy-39-212596.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.