తల్లీకూతుళ్లు ఆటో ఎక్కారు..వంట గురించి, షాపింగ్ గురించి చర్చించుకున్నారు. ఇద్దరు తల్లీకూతుళ్లు పిల్లలు, భర్తతో ఇబ్బం దులు మాట్లాడుకున్నారు, మరో చోట ఇద్దరు పిల్లల బడి ఫీజులు, ఉద్యోగాల్లో మార్పులు, ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడుకున్నా రు. కానీ సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ విమానంలో హోటీ పెటిట్, కీలీ పెటిట్ మాత్రం సాంకేతిక ఇబ్బందులేమన్నా ఉన్నాయేమోనని ఒక్కసారి చూసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. అవును వీళ్లద్దరూ తల్లీ కూతుళ్లు. ఇద్దరూ పైలట్లు. కెప్టెన్ హోలీ పెటిట్, ఫస్ట్ ఆఫీసర్ కీలీ పెటిట్!
సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో తల్లీకూతుళ్లు పైలట్స్గా ఉన్న తొలి జంట ఇదే! వీళ్లు నడిపే విమానం 3658 డెన్వర్ నుంచి సెంట్ లూయీ వరకూ వెళుతుంది. గత 23వ తేదీన వీళ్లిద్దర్నీ చూసి ప్రయాణీకులు ఎంతో ఆనందించారు. చాలామంది వీడియోల్లో బంధించారు. విడిగా ఫోటోలూ తీయించుకున్నారు. మరో పది నిమిషాల్లో విమానం బయలుదేరే ముందు ప్రయాణీకులకు హోలీ తన కుమార్తె కీలీని అందరికీ పరిచయం చేసింది. అందరూ ఆమెకు, ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నపిల్లగా ఉన్నపుడు విమానాశ్రయానికి తండ్రి తీసుకువస్తే కీలీ ముద్దగా చేతులూపుతూ తల్లికి గుడ్ బై, బెస్ట్ ఆఫ్ లక్! అని చెబుతూండేది. కొన్నేళ్ల తర్వాత ఇలా 18 ఏళ్ల పిల్లగా తన పక్కనే కూర్చుని నడపడాని సిద్ధపడిందని హోలీ తల్లిమనసుతో ఆనందం పంచుకుంది అంద రితో. పిల్ల బడికి వెళ్లడంలో కంటే ఇపుడు ఫ్లయిట్ నడపడానికి పక్కనే ఉండడంలో ఉండే ఆనందం ఆకాశమంత!
తనకు సినీ హీరోనో, క్రికెటరో, టెన్నిస్ ప్లేయరో అవాలనిపించలేదు.. తల్లిలా పైలట్ అయితే తల్లితోనే విమానంలో డ్రైవర్స్ వింగ్లో పనిచేయాలనుకుంది. అందుకే 14వ ఏటనే శిక్షణలో చేరి నాలుగేళ్ల శ్రమించి లైసెన్స్ సంపాదించింది కీలీ. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ లో 2017లో చేరింది. ఇటీవల ఇలా ఇద్దరూ కలిసేరు. మున్ముందు ఇలా కలుస్తారన్న నమ్మకం లేదు. డ్యూటీ, షిఫ్ట్లు లను అను సరించి ఉంటాయి గదా! ఇద్దరిదీ ఒక షిఫ్ట్ ఉండేట్టు కీలీ అధికారులను కోరిందిట. ఎప్పటికీ అలా ఒకే ఫిఫ్ట్లో వేయడానికి అదేమీ చిన్న ఉద్యోగం కాదు. అయినా అధికారులు అంగీకరిస్తారేమో చూద్దాం!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mother-39-141429.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.