ఖైదీలకు తీర్దయాత్రా బెయిల్ సౌకర్యం?
Publish Date:Dec 13, 2012
Advertisement
సత్యం రామలింగరాజుగారు ఏ ముహుర్తాన్నచంచల్ గూడా జైల్లోకి అడుగు పెట్టారో గానీ అయన తన రాకతో జైలుకి మంచి బోణీ చేసారని చెప్పవచ్చును. అంట వరకు ఏ గుర్తింపుకూ నోచుకోని చంచల్ గూడా జైలు, నాటినుండి పెద్ద రాజకీయ కార్యాలయంగా మారిపోయింది. ఇవాళ్ళ రేపు, సి.బి.ఐ. పుణ్యామాని అక్కడకి చేరుకొంటున్నరాజకీయనేతలకి కొదవలేదు. వారిని పరామర్శించేందుకు వచ్చే పెద్దలకు అంతూలేదు. ‘మా చంచలగూడ జైలుకి ఇంత రాజయోగం పట్టిందని’ జైలు సిబ్బంది సంతోషంతో ఉప్పొంగి పోతున్నారంటే ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక, ప్రస్తుతం రాజకీయఅడ్డాగా మారిన చంచల్ గూడ జైలులో విశ్రమిస్తున్నఅనేకమంది హేమా హేమీలతో జైలుగోడల మద్య తమ అనుభావాలు పంచుకొనే భాగ్యం పొందిన మాజీ మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు, అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. తానూ గత 18 సం.లుగా అయ్యప్పదీక్ష చేస్తున్నందున మళ్ళీ ఈ యేడు కూడా అయ్యప్ప మాల వేసుకోవడం జరిగిందని అందువల్ల కోర్టు వారు తనకి ఈ నెల 24 నుండి వచ్చే నెల 2వ తేది వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేయవలసిందిగా అయన కోర్టుకు విజ్ఞప్తి చేసారు. యధావిదిగా ‘సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ’ సి.బి.ఐ. అభ్యంతరం తెల్పింది. కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను ఈ నెల ౧౮కి వాయిదా వేసింది. ఇదంతా, నిత్యం చూస్తున్న తంతే గనుక ఇందులో ఎవరికీ ఆసక్తి ఉండకపోవచ్చు. గానీ, ఇలా మతపరమయిన కారణాలు చూపించి జైలులో ఉన్న ఖైదీలు బెయిలు అడిగినప్పుడు అందుకు కోర్టులు అంగీకరిస్తే అదోక కొత్త సాంప్రదాయం సృష్టించినట్లు అవుతుంది కదా? రేపు మిగిలిన ఖైదీలు కూడా వివిధ మాలలు వేసుకొని కోర్టువారిని బెయిలు కోరితే అప్పుడు పరిస్తితి ఏమిటి? అప్పుడు రాజకీయ ఖైదీలుగా ఉన్నపెద్దలకి ఒక న్యాయం సాధారణ ఖైదీలకు మరొక న్యాయం కోర్టులు అమలు చేయలేవు కదా? ఇప్పడు హిందూ మతస్తులయిన ఖైదీలు మాలలు వేసుకొని బెయిలు పొందే అవకాశం పొందగలిగితే, రేపు ఇతర మతస్తులయిన ఖైదీలు కూడా మత పరమయిన సంప్రదాయాలు పాటించేందుకు ఏ మక్కాకో లేక జేరుసలెంకో వెళ్ళడానికి బెయిలు కోరితే అప్పడు పరిస్తితి ఏమిటి? అసలు ఖైదీలుగా ఉన్నవారిని మతపరమయిన కారణాలతో బెయిలు మంజూరు చేయవచ్చా లేదా? అందుకు రాజ్యంగా ఏమి చెపుతుంది? ఈ ప్రశ్నలకి సి.బి.ఐ. కోర్టు ఈ నెల 18న తన నిర్ణయం తో తెలియజేయవచ్చునని ఆశిద్దాము.
http://www.teluguone.com/news/content/mopidevi-bail-24-19739.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





