నీరో చక్రవర్తిలా ప్రధాని మోడీ తీరు

Publish Date:Jun 19, 2022

Advertisement

దేశం తగులబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారని విన్నాం.. కానీ ప్రధాని నరేంద్రమోడీ తీరు చూస్తుంటే సరిగ్గా నీరో చక్రవర్తే గుర్తుకొస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ..నమో అంటూ అభిమానుల చేత ప్రశసంలు అందుకుంటుంటారు. అయితే ప్రధానిగా ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే విధానాలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఇటీవలి కాలంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, అమలు చేస్తున్న ప్రతి విధానం ప్రజలలో అసంతృప్తికి, ఆగ్రహానికీ కారణమౌతూనే ఉంది. అయితే ఆయన మాత్రం తన విధానాలను, నిర్ణయాలను వ్యతిరేకించే వారంతా దేశాభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారే అంటు ఎదురుదాడి రాజకీయంతో అణచివేయాలని చూస్తున్నారు. వ్యవసాయ చట్టాల విషయం తీసుకున్నా..ఇప్పుడు అగ్నిపథ్ పథకాన్ని తీసుకున్నా.. ఆయన తీరు ఒకేలా ఉంది. ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నా మోడీ మాత్రం నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయింపు లాంటి మాటలే మాట్లాడుతున్నారు. రైతు చట్టాల విషయమే తీసుకుంటే.. విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా, ఎటువంటి చర్చకు తావివ్వకుండా.. పార్లమెంటులో ప్రవేశ పెట్టి విపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా సభలో మంద బలంతో ఆమోదింప చేసుకున్నారు. ఈ విషయంలో విపక్షాల అభ్యంతరాలు, సూచనలను అసలు పరిగణనలోనికే తీసుకోలేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ ఉద్యమం చేశారు. హస్తిన సరిహద్దుల్లో టెంట్లు వేసి ఆందోళనలు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఉద్యమంలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆయన మౌనముద్ర వీడలేదు. అనివార్యంగా రైతు ఉద్యమం గురించి మాట్లాడాల్సి వచ్చినా కొన్ని శక్తులు రైతులను పక్కతోవ పట్టిస్తున్నాయన్న మాటనే పదే పదే వల్లె వేశారు తప్ప.. వారి వ్యతిరేకత వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఒక వైపు రైతు ఉద్యమం ఉదృతంగా సాగుతుండగానే ఆయన విదేశీ పర్యటనలతో కాలం గడిపేరు. యథా రాజా.. అన్న చందంగా మోడీ ఇలా మొండిగా వ్యవహరిస్తుంటే.. ఆయన కేబినెట్ లోని మంత్రులు సైతం అదే విధంగా ఇష్టారీతిన రైతుల ఉద్యమంపై విమర్శలు గుప్పించారు. విపక్షాలను నిందించారు. దేశంలో రైతు బాగుపడటం కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టం లేదని విమర్శించారు. రైతుల వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని అనడానికీ వెనుకాడలేదు. సరే ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ మోడీ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. 
ఇప్పుడు అగ్నిపథ్ విషయంలోనూ అంతే.. ఒక విధాన నిర్ణయం తీసుకునేటప్పడు విపక్షాలతో చర్చించడం కానీ, సభలో ప్రవేశ పెట్టి సమగ్ర చర్చ జరపడం కానీ లేకుండానే.. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్నిపథ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించేశారు. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభం కాగానే ఆయన గతంలోలానే ఇది దేశ ప్రగతిని ఓర్వలేని శక్తులు నడిపిస్తున్న ఉద్యమం అంటూ ఓ విమర్శ చేసేసి తన స్వరాష్ట్రంలో పర్యటనకు వెళ్లిపోయారు. సరిగ్గా సాగు చట్టాల విషయంలో వ్యవహరించినట్లు మోడీ కేబినెట్ లోని మంత్రులు మాత్రం అగ్నిపథ్ పథకాన్ని అద్భుతం అని అభివర్ణిస్తూ, వ్యతిరేక ఆందోళనల వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయనీ, ఆర్మీ బలోపేతం కావడం ఇష్టం లేని శక్తులే వెనుకుండి ఈ ఆందోళనలను రెచ్చగొడుతున్నాయనీ విమర్శలు మొదలెట్టేశారు. ఈ రెండు విషయాలలోనే కాదు.. గత ఎనిమిదేళ్లుగా ప్రధాని మోడీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా వారిపై దేశ వ్యతిరేకులు, ప్రగతి నిరోథకులు అన్న ముద్ర వేయడం మోడీ ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా  మారిపోయింది.  సమస్యను పక్కతోవ పట్టించేందుకు దేశ భక్తి అంశాన్ని ఉపయోగించుకునే మోడీ తీరు మారాలి. సమస్యలపై, ప్రజాందోళనలపై అన్ని పక్షాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించాలి.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.