వైసీపీ నుంచి వలసలు.. టీడీపీలోకి బారులు బారులు?!

Publish Date:Dec 11, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. జగన్ పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను పసిగట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా సీనియర్ నాయకులు మెల్లమెల్లగా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. నిజానికి ఇప్పటికే అనేక మంది వైసీపీ సీనియర్ నేతలు టీడీపీ టచ్ లోకి వచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికలు ఎప్పుడనేది ఇతమిథ్దంగా తేలితే, ఫిరాయింపులు జోరందుకోవడం ఖాయంగా  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక అన్ని రోడ్లూ రోమ్ వైపే అన్నట్లుగా వైసీపీ నుంచి బయటకు వచ్చే వారందరి చూపూ తెలుగుదేశం వైపే అన్నట్లుగా ఉంది. అయితే కొత్త వారి చేరికల విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.  ముఖ్యంగా,కష్ట కాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుల ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. . అందుకే   పార్టీని నమ్ముకున్న స్థానిక నాయకుల అనుమతి లేకుండా కొత్త వారిని చేర్చుకోరాదని, రాష్ట్ర,  జిల్లా  స్థాయి నాయకులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే,  అనేక జిల్లాల్లో వైసీపీకి కొందరు కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా, చంద్రబాబు నాయుడు తొందరపడడం లేదని అంటున్నారు. 

ఇక ఇప్పుడు తెలుగుదేశంలో అవకాశం ఉంటుందా? ఉండదా అన్న మీమాంసకు కూడా స్వస్తి చెప్పి వైసీపీ నుంచి నేతలు బయటకు వచ్చేయడానికి ఇసుమంతైనా సందేహించడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ చార్జ్ లు వైసీపీకి కటీఫ్ చెప్పేడయాన్ని పరిశీలకులు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఇంకా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు వంటి వారు తెలుగుదేశం ఎప్పుడు తలుపుతెరుస్తుందా అ    ని వేచి చూస్తున్నట్లు చెబుతున్నారు.   అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో వైసీపీ అసంతృప్తులు తెలుగుదేశం తలుపు తట్టేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్నారు.  

అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్  సొంత గడ్డ ఉమ్మడి కడప జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వలసలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కడప జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం గూటికి చేరేందుకు పులివెందుల   ఇన్  చార్జ్ బీటెక్ రవి ద్వారా  వారు చంద్రబాబుకు టచ్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ కారణంగానే బీటెక్ రవిపై జగన్ పోలీసులను ప్రయోగించారని కూడా జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.  
అయితే వైసీపీ ఈ పరిస్థితికి దిగజారడానికి కారణం పాలనా వైఫల్యాలతో పాటు జగన్ వ్యవహారశైలి కూడా కారణమని అంటున్నారు. జగన్ తీరు కారణంగానే బంధువులు, సన్నిహితులు కూడా ఆయనకు, పార్టీకి దూరమౌతున్నారని, గతంలో  ఆయన కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలబడిన వారంతా ఇప్పుడు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు.   అన్నిటికీ మించి జగన్ పట్ల వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకత తమనూ ముంచేస్తుందన్న భయంతో ముందుగానే చేతులెత్తేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.  ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే పరిస్థితి ఇలా ఉందంటే..  ముందుముందు ఇంకెలా ఉంటుందో ఊహకు అందనిదేమీ కాదని చెబుతున్నారు.  

By
en-us Political News

  
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.