ప్లాన్ అదుర్స్

Publish Date:Dec 12, 2023

Advertisement

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే... జగన్ పార్టీకీ గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ శాశ్వత సభ్యత్వానికే కాదు.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్‌లో రాసిన ఆ రాజీనామా లేఖను ఆయనే స్వయంగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి మరీ సభాపతి కార్యదర్శికి అందజేశారు. అయితే ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌కి నమ్మిన బంటులా వ్యవహరించే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

 ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వెనుక బలమైన కారణాలున్నాయని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. మంగళగిరి నుంచి వరుసగా రెండు సార్లు జగన్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందినా.. ఈ రాముడిపై ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ మాత్రం.. శీతకన్ను వేశారని అంటున్నారు. అయితే   2019 ఎన్నికల్లో సైతం వరుసగా రెండోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారని.. అదీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ మంత్రి, అన్నిటికీ మించి తెలుగుదేశం అధినేత కుమారుడు అయిన లోకేష్ పై విజయం సాధించారు. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా, కానీ జగన్ తనకు కేబినెట్ లో చోటివ్వలేదన్న అసంతృప్తి ఆళ్లలో ఏర్పడిందంటున్నారు. కాగా  ఇక 2019 ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళగిరి వచ్చిన  జగన్.. ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించి.. అసెంబ్లీకి పంపిస్తే.. ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకుంటానని నియోజకవర్గ ప్రజల సాక్షిగా షిక్కటి చిరునవ్వుతో  వాగ్దానం చేశారు. దీంతో  తమ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అవుతారన్న ఉద్దేశంతో జనం ఆళ్లను వరుసగా రెండో సారి గెలిపించారు.  ఆ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  జగన్ ముఖ్యమంత్రి  అయ్యారు. అయితే ఆళ్లకు మాత్రం మంత్రిపదవి దక్కలేదు.  అప్పటికి సరిపెట్టుకున్న ఆళ్ల  2022  ఏప్రిల్‌లో జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా జగన్ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఆళ్ల అప్పటి నుంచీ పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. 

 జగన్.. కాంగ్రెస్ ను వీడి  వైసీపీని ఏర్పాటు చేసిన నాటి నుంచి  ఆయన అడుగులో అడుగు వేసినా.. తనకు మంత్రిగిరి ఇవ్వకుండా.. 2019 ఎన్నికలకు ముందు జస్ట్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి చిలకలూరిపేట నుంచి గెలిచి తొలి సారి ఎమ్మెల్యే అయిన విడదల రజనీకి  మంత్రి పదవి కేటాయించడంతో ఆర్కే తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

  మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నారా లోకేశ్ ఓటమి పాలైనా.. నిన్న మొన్నటి వరకు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల మధ్యే ఉండడం.. వారి సమస్యలు తెలుసుకోని.. వాటి పరిష్కారం దిశగా ఆయన అడుగులు వేయడం.. అంతేకాకుండా.. ఆ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు, ఆరోగ్య సంజీవని పేరిట మొబైలు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం.. అలాగే వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్తామంటూ ఇప్పటికే జనసేన, టీడీపీలు ప్రకటించడం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో సైతం ప్రభుత్వ వ్యతిరేకత కొట్టోచ్చినట్లు కనిపించడం.. అలాంటి వేళ.. రానున్న ఎన్నికల్లో ఇదే పరిస్థితి మనకు కానీ ఎదురైతే మన పరిస్థితి ఏమిటనే ఓ చర్చకు తాడేపల్లిలోని జగన్ అండ్ కో తెర తీసి.. ఆ క్రమంలో వ్యూహాత్మక పథక రచనకు శ్రీకారం చుట్టినట్లు సదరు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

అందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో తాడేపల్లిలోని పెద్దలు స్వయంగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయించారని.. దాంతో రానున్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆర్కే బరిలోకి దిగడం.. తద్వారా ఓట్లు చీల్చడంతో.. నారా లోకేశ్‌ను ఓడించాలనే ఓ ఎత్తుగడను ఖాయం చేసినట్లు ఓ చర్చ అయితే హాట్ హాట్‌గా హీట్ హీట్‌గా సాగుతోన్నట్లు సమాచారం. ఇప్పటికే నారా లోకేశ్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలవలేక పోయారంటూ జగన్ పార్టీ  ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లింది.. వెళ్తోంది. అంతేకాదు.. మంగళగిరిలో నారా లోకేశ్ ఓటమి కోసం.. సీఎం జగన్ అండ్ కో శక్తియుక్తులన్నీ దారపోస్తున్నారని... ఆ క్రమంలో ఇప్పటికే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎం హనుమంతరావును వైసీపీలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. అలాగే మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవిని తెలుగేదేశం నుంచి వైసీపీలోకి తెచ్చుకుని  రానున్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి   పార్టీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు జగన్ అండ్ కో ఇప్పటికే నిర్ణయించిందని.. ఆ క్రమంలో ఆ నియోజకవర్గం ఇన్‌చార్జీగా ఆయనకు బాధ్యతలు కట్టబెట్టిందని.. ఆ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పదవులన్నీంటికి రాజీనామా చేయించి.. కొత్త నాటకానికి తెర తీశారనీ,  ఇలా మంగళగిరిలో నారా లోకశ్ ఓటమి కోసం.. జగన్ అండ్ కో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకొంటూ ముందుకు వెళ్తున్నారన్న   ప్రచారం  నియోజకవర్గంలో  జోరుగా సాగుతోంది.  

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.