ఆంధ్రా మాల్యా..గోల్డ్‌స్టోన్ ప్రసాద్..!

Publish Date:Jun 1, 2017

Advertisement

హైదరాబాద్ శివార్లలో వెలుగులోకి వచ్చిన భారీ భూకుంభకోణం ప్రభుత్వవర్గాల్లోనూ..అధికారుల్లోనూ తీవ్ర అలజడి రేపుతోంది. సుమారు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా పక్కదారి పట్టించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ భూముల మళ్లింపు ద్వారా ప్రభుత్వానికి రూ.587.11 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ కుంభకోణం వెనుక దాగిఉన్న పెద్ద తలకాయలు ఎవరా అన్నది చర్చానీయాంశంగా మారింది. పలువురు రియల్టర్లు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కలిసి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెర లేపినట్లు సమాచారం. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న అక్రమార్కులు..తమ బండారం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఇందులో పాత్రధారులతో పాటు తెర వెనుక సూత్ర ధారులను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించిన వ్యక్తి గోల్డ్ స్టోన్ ప్రసాద్‌ ఆచూకీ కోసం పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దేశం మొత్తం గాలిస్తున్నారు.

 

అసలు ఎవరీ గోల్డ్‌స్టోన్ ప్రసాద్..?

ఇప్పటి వరకు పోలీసులు చేసిన దర్యాప్తులో ప్రసాద్ చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇతని పూర్తి పేరు పొన్నాపుల సంజీవ ప్రసాద్ అలియాస్ పిఎస్ ప్రసాద్ అలియాస్ గోల్డ్‌స్టోన్ ప్రసాద్. గోల్డ్ స్టోన్ గ్రూప్ ఛైర్మన్‌గా, మానసిక వైద్యుడిగా చలామణి అవుతూ దాని వెనుకే కబ్జాలు, సెటిల్‌మెంట్లతో భూదందా సాగిస్తున్న అతని నిజస్వరూపం వెలుగులోకి వస్తోంది.  అతని ప్రస్థానం అనేక చీకటి కోణాల మయం. ఏకంగా అమెరికాలోని ఫైనాన్షియల్ సంస్థలకు టోకరా వేసి ఘనత వహించిన అమెరికా దర్యాప్తు సంస్థలనే ముప్పుతిప్పలు పెట్టిన ఘనుడు. లేని ఆస్తులను ఉన్నట్లు చూపించి బీసీసీఐ బ్యాంక్ నుంచి 16.8 మిలియన్ డాలర్లు, 1.4 మిలియన్ డాలర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, 1.5 మిలియన్ డాలర్లు బ్యాంక్ ఆఫ్ ఒమన్ నుంచి, బ్రాంచ్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ కంపెనీ ఆఫ్ నార్త్ కరోలినా నుంచి 2.5 మిలియన్ డాలర్లు , ఇలా మొత్తం 27 మిలియన్ డాలర్ల లోన్‌ను మంజూరు చేయించుకున్నారు.

 

బీసీసీఐ బ్యాంక్‌ నుంచి రుణాన్ని మంజూరు చేయించుకునేందుకు గాను బ్యాంక్ ఛైర్మన్‌కు 2.50 లక్షల డాలర్లు, చీఫ్ క్రెడిట్ మేనేజర్‌కు లక్ష డాలర్లు లంచం ఇచ్చినట్లు గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌పై అభియోగాలున్నాయి. ఇచ్చిన రుణం వెనక్కు రాకపోవడం..తదితర కారణాలతో అనతి కాలంలోనే బీసీసీఐ బ్యాంక్ దివాళా తీసింది. ఉన్నపళంగా ఈ బ్యాంక్ దివాళాకు కారణమేంటో తెలుసుకోవాలని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఒక దర్యాప్తు కమిటీని నియమించింది. ఇక్కడే ఉంటే తన బాగోతం బయటపడుతుందని భావించిన ప్రసాద్ అమెరికా నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ కేసుతో అతనికి world's most wanted fugitiveగా పేరు వచ్చింది. భారత్‌కు తిరిగివచ్చిన తన పలుకుబడితో మళ్లీ కంపెనీలు ప్రారంభించాడు..అప్పట్లో ఓ మాజీ ప్రధాని, ఇతర ప్రముఖులతో ఉన్న సాన్నిహిత్యం ఉండటంతో ఇతను ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. మాజీ ప్రధానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ సతీశ్ శర్మ అతని సోదరుడు గ్యారీ శర్మ గోల్డ్‌స్టోన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.

 

హైదరాబాద్‌ను తన కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా మార్చిన ప్రసాద్‌కు ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్‌గా పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కీలకపాత్ర పోషిస్తున్న నేత బాగా దగ్గరయ్యాడు. ఇంకేముంది రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండటంతో తనలోని కబ్జాదారుడిని మెల్కొలిపాడు. సాధారణ ప్రజల భూముల నుంచి ప్రభుత్వ భూములను హామ్ ఫట్ చేస్తూ అతని దందా సాగింది..ప్రసాద్ కబ్జాల గురించి శివారు ప్రాంతాల ప్రజలు కథలు, కథలుగా చెప్పుకుంటారు. నిజాం కుటుంబానికి చెందిన అత్యంత విలువైన భూములను కూడా అక్రమంగా ప్రసాద్ అనుచరులు రాయించుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఖుర్షీద్ జాహి ఎస్టేట్‌కు చెందిన రూ.40 వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హామీద్ ఉన్నీసాబేగం గతంలో ముఖ్యమంత్రులను కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.

 

తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఇప్పుడు ఏకంగా అతిపెద్ద భూకుంభకోణానికే తెరదీశాడు. అప్పుడు బీసీసీఐ బ్యాంక్ అధికారులు సహకరించినట్లుగానే ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ రాచకోండ శ్రీనివాస్, అధికారులు, బడా రాజకీయ నేతలు ప్రసాద్‌ పనిలో తలో చేయ్యి వేసి ప్రభుత్వానికి వందల కోట్లు నష్టం చేకూర్చారు. అడ్డూ అదుపు లేకుండా పెద్ద ఎత్తున భూకబ్జాలు, లావాదేవీలు జరుపుతున్నా ఇంతవరకు ఆయన పేరు గానీ..ఆయన పై ఫిర్యాదు కానీ నమోదు కాలేదంటే ఎంతటి బలమైన వ్యక్తులు ప్రసాద్ వెనుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ పాపం పండినప్పుడు ఎంతటి పలుకుబడి ఉన్నా..ఎవరున్నా తప్పించుకోలేరు..

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.