వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించండి : మంత్రి లోకేష్

Publish Date:Jun 26, 2026

Advertisement

 

రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింత‌గా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్జీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. శుక్రవారం స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ క‌మాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్టీజీఎస్‌పై మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ ల‌క్ష్యాలు, ప్రాజెక్టుల ప్ర‌గ‌తిపై ఆ శాఖ కార్య‌ద‌ర్శి కాటంనేని భాస్క‌ర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివ‌రించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ ప‌నుల‌న్నీ జులై నాటికి పూర్తికావాలని మంత్రి ఆదేశించారు. 

కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలి. సంజీవని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్ తో అనుసంధానించాలి. పాఠశాలల్లో  డ్రాప్ అవుట్ల‌ను డేటా లేక్ ద్వారా విశ్లేషించి, త‌గ్గించ‌డానికి గ‌ల‌ మార్గాలను అన్వేషించాలి. విద్యారంగంలో సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నాం. అన్ని శాఖల సమాచారం డేటా లేక్ ద్వారా అనుసంధానం కావాలని మంత్రి సూచించారు. 

మనమిత్ర ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావాలి

ప్రజల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై మరింతగా అవగాహన కలిగేలా నెలరోజుల పాటు కార్యక్రమాలు నిర్వ‌హించాల‌న్నారు. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌జ‌ల‌కు క‌లిగే ఉప‌యోగం, వినియోగం, సుల‌భంగా ప్ర‌భుత్వ సేవ‌లు ఎలా పొంద‌వచ్చో ప్ర‌జ‌లకు వివరించాలన్నారు. 

స‌ర్టిఫికెట్ల వెర్ఫికేష‌న్‌కు ఆధార్‌

విద్యార్థులు, అభ్య‌ర్థులకు విద్యా-క్రీడా సంస్థ‌లు ఇచ్చే స‌ర్టిఫికెట్లు, స్పోర్ట్స్ స‌ర్టిఫికెట్ల‌న్నీ అభ్య‌ర్థి ఆధార్ నెంబర్ ఆధారంగా పార‌ద‌ర్శ‌కంగా ప‌రిశీలించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు. అభ్య‌ర్థి ఆధార్ నంబ‌ర్ కొడితే ఆ విద్యార్థి లేదా అభ్య‌ర్థికి ఆ సర్టిఫికెట్లు ఏ సంస్థ‌, ఎప్పుడు, ఎవరు జారీ చేశార‌నే వివ‌రాలు కూడా రియ‌ల్ టైమ్‌లో తెలిసేలా డీజీ వెరిఫైని ప‌క‌డ్బందీగా తీర్చిదిద్దాల‌ని ఆదేశించారు. దీనివ‌ల్ల 99 శాతం అధికారుల ప‌ని కూడా సుల‌భ‌త‌రం అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో  ఇచ్చే వేలాది పోస్టుల నోటిఫికేష‌న్ల‌కు, ల‌క్షల సంఖ్య‌లో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకుంటార‌ని, వీరంద‌రి స‌ర్టిఫికెట్లు పొందుప‌ర‌చ‌డంలో ఇబ్బందులు లేకుండా డీజీ వెరిఫైని స‌మర్థ‌వంతంగా వినియోగించుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలని ఆదేశించారు.

వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌ను స‌మర్థంగా ఎదుర్కొందాం

రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావంపైనా మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఎల్‌నినో ప్ర‌భావంతో ఎదుర‌య్యే వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌ను జ‌ల‌వ‌నరుల శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ‌, ఇత‌ర శాఖ‌ల‌న్నీ కూడా స‌మ‌న్వ‌యంతో, ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ప‌నిచేసి స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొందామ‌న్నారు. నీరు వృథాను అరిక‌ట్టి, త‌క్కువ నీటితో ఎక్కువ పంట‌లు  పండించే దిశ‌గా రైతులను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. జ‌లాశ‌యాల్లో నీటి ల‌భ్య‌త ఎంత ఉంది, భూగ‌ర్భజ‌ల మ‌ట్టాలు ఏ స్థాయిలో ఉన్నాయ‌నేది ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం ద్వారా రియ‌ల్ టైమ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని ఆ దిశ‌గా అధికారులు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాలి. రాయ‌లసీమ‌లో నీటి ఎద్ద‌డి లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. యూరియా సరఫరాపైనా మంత్రి ఆరా తీశారు. 

 విద్యుత్ డిమాండ్ పైనా దృష్టి కేంద్రీకరించాలి 

వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి త‌గ్గడంతో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు అధిగ‌మించేందుకు ప్రణాళికాబ‌ద్ధంగా ప‌నిచేయాల‌ని మంత్రి సూచించారు. జ‌లాశ‌యాల్లో నీటి మ‌ట్టాలు, పెరుగుతున్న విద్యుత్తు వినియోగం, భూగ‌ర్భ జ‌లాలు వీటన్నిటినీ క్రోడీక‌రించి ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం విశ్లేషించి అధికారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందజేయాలి. విద్యుత్తు స‌ర‌ఫ‌రాకు ఎక్క‌డా ఎలాంటి అంతరాయం లేకుండా ప‌టిష్ట‌ చ‌ర్య‌లు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో సీసీఎల్ఏ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌య‌ల‌క్ష్మి, ఆర్టీజీఎస్ సీఈవో ప్ర‌ఖ‌ర్ జైన్‌,  సంయుక్త కార్య‌ద‌ర్శి మాలిక గార్గ్‌, ఆర్టీఐహెచ్ సీఈవో ధాత్రి రెడ్డి, ఫైబ‌ర్‌నెట్ ఎండీ గీతాంజ‌లి శ‌ర్మ‌, సివిల్ స‌ప్లైస్ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు, ఉన్న‌త విద్యాశాఖ క‌మిష‌న‌ర్ నారాయణ భ‌ర‌త్ గుప్త‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ త‌మీమ్ అన్సారియా, వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ మన్జీర్ జిలానీ పాల్గొన్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఒక్కసారిగా సంభవించిన ఒక ఘోర ప్రమాదం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
ఇటీవల ఓ సందర్భంలో ప్రభుత్వ ప్రజారవాణా బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్.. ఆ బస్సు ప్రయాణం తరువాత రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మేరకురాష్ట్ర ప్రభుత్వం ఇకపై కొనుగోలు చేసే బస్సులన్నీ ఏపీ సౌకర్యంతో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తమ మధ్య వైవాహిక వివాదాలు ఉన్నాయని, తన భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల ఆరోపణలు ఉన్నాయని అరుణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై 2017 జూన్‌లోనే కేసు నమోదైనట్లు పేర్కొన్న ఆమె.. ఒకవేళ ఇప్పుడు ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తే.. తన జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో ఉన్నతమైన హోదాల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్ అధికారిణి ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఈ ఫేక్ వీడియోలు ఉన్నాయంటూ తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే గతంలో రెండు సార్లు విచారణకు హాజరు కావడానికి గడువు కాలాలంటూ కోరిన గుడివాడ అమర్నాథ్ ఈ రోజు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే, మన దేశంలోని గోవా రాష్ట్రంలో ఉండే మొత్తం కుటుంబాల కంటే కూడా గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఉపాధి కోసం ఎంతలా జనం ఇక్కడికి తరలివస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం.
అద్విత్ జ్యువెలర్స్ ఐపీఓ 212.63 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌తో రికార్డు సృష్టించింది. రూ. 46 జీఎమ్‌పీతో జూలై 1న భారీ లిస్టింగ్ లాభాల అంచనాలు. పూర్తి వివరాలు మరియు అలాట్‌మెంట్ స్టేటస్ ఇక్కడ చూడండి.
జూలై 4 నుండి ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు మరియు ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్లు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్‌ లీగ్ (EWCL) లోగో జూబ్లీహిల్స్‌లో ఘనంగా ఆవిష్కరించబడింది. ఆగస్టు 15 నుంచి 16 జట్లతో ప్రారంభం కానున్న ఈ లీగ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్న సంగతి విదితమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అంబానీ ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
2026 ఫిఫా వరల్డ్‌కప్‌ నాకౌట్‌లో పెను సంచలనం నమోదైంది. బలమైన జర్మనీ జట్టుకు పరాగ్వే పెనాల్టీ షూటౌట్‌లో 4 3 తేడాతో షాకిచ్చి లాస్ట్ 16కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) భారత ఫార్మా కంపెనీలు, కెమిస్ట్ అసోసియేషన్లపై దాఖలైన 14 ఏళ్ల నాటి యాంటీ కాంపిటీటివ్ కేసును కొట్టివేసింది. తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ వెలువరించిన ఈ కీలక తీర్పు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వల్ల డబ్బు ఆదా అవుతుందని అనుకుంటున్నారా అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే. మానవ ఉద్యోగుల కంటే ఏఐ నిర్వహణకే టెక్ కంపెనీలకు విపరీతమైన ఖర్చవుతోందని ఎన్విడియా ఎగ్జిక్యూటివ్ మరియు ఎంఐటీ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.